iDreamPost

సాయం చేయండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో ఉండగానే పవన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో ఉండగానే పవన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

సాయం చేయండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో ఉండగానే పవన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంటుంది రేణు దేశాయ్. అయితే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ తనకు సంబంధించిన విషయాలను, సొసైటీకి సంబంధించిన అంశాలను పోస్టు చేస్తుంటుంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టులో సాయం చేయమని అర్థిస్తున్నట్లుగా ఉంది. ఇంతకీ ఆమె దేనీ కోసం సాయమడిగిందో తెలుసా?

వ్యక్తి గత జీవితంలో చోటుచేసుకున్న కారణాల వల్ల రేణు దేశాయ్ సినిమాలకు దూరమైంది. కాగా ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో మంచి పాత్రలో ప్రేక్షకులను అరించింది రేణు దేశాయ్. ఇదిలా ఉంటే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో మూడు శునకాలకు సర్జరీ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోందని, ఆపరేషన్ మొత్తం ఖర్చుకి రూ. 55 వేలు అవుతున్నట్లు తెలిపింది.

Renu desai heliping for poor people

ఇందుకోసం రేణు దేశాయ్ తన వంతు సాయంగా 30వేలు విరాళమిచ్చినట్లు తెలిపింది. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ ఆ పొస్టు ద్వారా నెటిజన్లను కోరింది. ‘నేను రూ.30 వేలు అందించాను. దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్‌ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. పెంపుడు జంతువుల పట్ల మమకారం ఉన్న రేణు దేశాయ్ వాటికి ఏమైనా ఆపద తలెత్తితే తట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే తను ఈ విధంగా సాయం అందించాలని నెటిజన్లను కోరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి