iDreamPost

ఇండస్ట్రీలో విషాదం : ప్రముఖ నటి ఆత్మహత్య..!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి, కోలీవుడ్-టాలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. ఇప్పుడో యువ నటి మరణించిందన్న వార్త వచ్చింది.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి, కోలీవుడ్-టాలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. ఇప్పుడో యువ నటి మరణించిందన్న వార్త వచ్చింది.

ఇండస్ట్రీలో విషాదం : ప్రముఖ నటి ఆత్మహత్య..!

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇటీవల టాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు మృతి చెందారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి ఈ నెలలోనే కన్నుమూశారు. ఆ వెంటనే కోలీవుడ్- టాలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా మరణించారన్న వార్త వచ్చింది. కోలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఫెర్నాండేజ్ సినిమా షూటింగ్ సమయంలోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. మాలీవుడ్ ప్రముఖ నటుడు కుందర జానీ కూడా గుండె పోటుతో కన్నుమూశారు. వీరి మరణాలు ఆయా పరిశ్రమల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పుడు ఓ యువ నటి మృతి చెందిందన్న వార్త బయటకు వచ్చింది.

మలయాళ టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయస్సు 35 ఏళ్లు మాత్రమే. సోమవారం ఉదయం తిరువనంతపురంలోని శ్రీకార్యంలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె భర్త మనోజ్ కూడా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. బెడ్ రూమ్‌లో చీరకు వేలాడుతున్న ఆమె మృతదేహన్ని గుర్తించారు. ఆమె టీవీ రంగంతో పాటు సినిమాల్లోనే సహాయక పాత్రల్లో నటించింది. స్త్రీ, నిజాలట్టం, మాగల్యూడ్ వంటి 20కు పైగా సీరియల్స్ చేసింది. సిటీ ఆఫ్ గాడ్, మెరిక్కుండోరు కుంజడు, ముంబై మార్ఛ్, కార్యస్థాన్, వన్ వే టికెట్, అద్బుత దీపు వంటి చిత్రాల్లో సహాయక పాత్రలో మెరిసింది. చివరగా ఆమె ఆనందరాగం సీరియల్స్‌లో కనిపించింది. అనేక టీవీ షోల్లో కూడా పాల్గొంది. అయితే ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి