iDreamPost

పురోహితుడికి అవమానం! ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది!

  • Published Apr 21, 2024 | 11:44 AMUpdated Apr 21, 2024 | 11:44 AM

Youth Teasing Pandit: ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పురోహితుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Youth Teasing Pandit: ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పురోహితుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

  • Published Apr 21, 2024 | 11:44 AMUpdated Apr 21, 2024 | 11:44 AM
పురోహితుడికి అవమానం! ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది!

వివాహబంధం అనేది ఓ మధురమైన జ్ఞాపకం. ఒక వివాహం జరగాలంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని ఇరు కుటుంబ సభ్యులు ఆర్థిక స్థితిగతులు విచారించి, కాబోయే వధూవరుల ఇష్టాఇష్టాలు తెలుసుకొని పెళ్లి తంతు కానిస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. పెళ్లికి పురోహితులు చాలా ముఖ్యం. పురోహితుడు వివాహ మంత్రాలతో క్రతువును నిర్వహిస్తాడు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వివాహ వేడుకలో పురోహితుడు లేనిదే ఏ పని జరగదంటారు. అయితే ఇటీవల పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్ర ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బ్రహ్మణుడికి విషయంలో జరిగిన ఘటన నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

వివాహ వేడుకల్లో వధూవరులతో పాటు బంధువులు, సన్నిహితులు ఒకరినొకరు ఆటపట్టించడం చూస్తూనే ఉంటాం. కొన్ని సమయాల్లో ఇది ఫన్నీగా ఉన్నా.. ఒక్కోసారి సీరియస్ గా మారుతుంటాయి. ఈ తరహా వీడియోలో నెట్టింట ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. పెళ్లి వేడుకలో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. కొంతమంది ఆకతాయిలు దారుణంగా అవమానించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ షాకింగ్ హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుకలో వధూవరులు వేదికపై కూర్చొని ఉన్నారు. ఎదురుగా పురోహితుడు వివాహ క్రతువు నిర్వహిస్తున్నాడు. అప్పటి వరకు బాగానే ఉంది.. అంతలోనే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు మంత్రాలు చదువుతున్న పురోహితుడి తలపై ఖాళీ సంచిని బొర్లించారు. దీంతో పురోహతుడు తో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ తిన్నారు. అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు సర్ధిచెప్పడంతో పురోహితుడు వేదికపై కూర్చొని క్రతువు మళ్లీ ప్రారంభించాడు. అంతటితో కుర్రాళ్లు ఆగలేదు.. మరోసారి ఆయనపై ఎర్ర రంగు చల్లడంతో పాటు దుప్పట్లు విసిరారు. దీంతో పురోహితుడి సహనం నశించిపోయింది.. లేచి ఆవేశంతో అక్కడ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ‘ఈ పెళ్లి నేను చేయను.. వెళ్ల పోతున్నా’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని.. పురోహితుడిని అవమానిస్తే పాపన పడిపోతారు అంటూ కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి.. అంటూ పలు ఎమోజీలను పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి