iDreamPost

కొడుకు విషయంలో కోహ్లీ ఇంత భయపడ్డాడా? ఏమి జరిగిందంటే?

  • Published Feb 21, 2024 | 2:18 PMUpdated Feb 21, 2024 | 2:18 PM

Virat Kohli, Akaay: విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కొడుకు విషయంలో కోహ్లీ చాలా భయపడినట్లు తెలుస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Akaay: విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. కొడుకు విషయంలో కోహ్లీ చాలా భయపడినట్లు తెలుస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 2:18 PMUpdated Feb 21, 2024 | 2:18 PM
కొడుకు విషయంలో కోహ్లీ ఇంత భయపడ్డాడా? ఏమి జరిగిందంటే?

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. కోహ్లీ-అనుష్క దంపతులకు ఈ నెల 15న కొడుకు పుట్టిన విషయాన్ని తాజాగా కోహ్లీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే.. కొంతకాలంగా కోహ్లీ టీమిండియాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వ్యక్తిగత కారణమని చెప్పి.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కి ముందు ఇంటికి వెళ్లిన కోహ్లీ, ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కోహ్లీకి తల్లికి ఆరోగ్యం బాగా లేదని ఒక వార్త వచ్చినా.. దాన్ని కోహ్లీ సోదరుడు ఖండించాడు. ఆ తర్వాత కోహ్లీ ఫ్రెండ్‌, మాజీ క్రికెటర్‌ డెవిలియర్స్‌.. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడని ప్రకటించి, తర్వాత తాను చెప్పింది అబద్దమన్నాడు. దీంతో అంతా గందరగోళం నెలకొంది.

అసలు కోహ్లీ కుటుంబంలో ఏం జరుగుతోందోనని క్రికెట్‌ అభిమానులంతా కంగారు పడ్డారు. కోహ్లీ తిరిగి టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న క్రమంలో కోహ్లీ ఒక శుభవార్త చెప్పాడు. తనకు కొడుకు పుట్టాడని, అతని పేరు శివుడు అనే అర్థమొచ్చేలా అకాయ్‌ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. అయితే.. కోహ్లీ తన కొడుకు విషయంలో చాలా భయపడినట్లు తెలుస్తోంది. మొదటి డెలవరీ సయమంలో తన కూతురి ఫొటోలు బయటికి రాకుండా కోహ్లీ దంపతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వామికా ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

అయితే.. వామికా విషయంలో చేసిన పొరపాటు, తప్పులు ఈ సారి జరగకుండా కోహ్లీ దంపతులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అందుకే అసలు అనుష్క శర్మ గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియకుండా చాలా గోప్యంగా ఉంచారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి లండన్‌లోనే ఉంది. డెలవరీకి సమయం దగ్గర పడుతున్న క్రమంలో కోహ్లీ సైతం ఏం చెప్పకుండా.. కేవలం వ్యక్తిగత కారణాలంటూ లండన్‌ వెళ్లిపోయాడు. పైగా బాబు పుట్టిన ఐదు రోజుల తర్వాత గానీ, ఈ ప్రపంచానికి కోహ్లీకి కొడుకు పుట్టిన విషయం తెలియలేదంటే.. కోహ్లీ ఎంత జాగ్రత్త తీసుకున్నాడో అర్థం అవుతుంది. ప్రైవసీ విషయంలో ఎలాంటి తప్పు జరగొద్దనే భయంతోనే కోహ్లీ-అనుష్క దంపతులు ఇంత గోప్యంగా వ్యవహరించారని తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి