iDreamPost

I LOVE YOU అని రాసి పెట్టి.. 20 లక్షలు దోచుకెళ్లారు..

I LOVE YOU అని రాసి పెట్టి.. 20 లక్షలు దోచుకెళ్లారు..

గోవాలో జరిగిన ఓ దొంగతనం బాధతో పాటు ఆశ్చర్యాన్ని కూడా మిగిల్చింది. దక్షిణ గోవాలోని మార్గోవ్ లో ఆసిబ్ జెక్ అనే వ్యక్తి ఇంట్లో తాజాగా దొంగతనం జరిగింది. అతను పని మీద రెండు రోజులు ఊరికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత అతని ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకి ఫిర్యాదు చేసాడు.

పోలీసులు కథనం వివరాల ప్రకారం.. ఆసిబ్ జెక్ ఊరెళ్ళాక తిరిగొచ్చే ముందు రోజు రాత్రే ఈ దొంగతనం జరిగిందని, దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఇంటి తాళాలని పగలగొట్టి లోపలి వచ్చారని తెలిపారు. ఈ దొంగతనంలో 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు 1.5 లక్షల నగదుని కూడా దోచుకెళ్లారు. అయితే వీటిని దోచుకెళ్లడమే కాకుండా వెళ్లేముందు టీవీ స్క్రీన్ మీద మార్కర్ తో I LOVE YOU అని రాసి వెళ్లారు.

రెండు రోజులు ఊళ్ళో లేకపోయినా తిరిగొచ్చే ముందు రోజు రాత్రే దొంగతనం జరగడం, కేవలం బంగారం, డబ్బులు ఎత్తుకెళ్ళడం, I LOVE YOU అని రాసి వెళ్లడం బట్టి ఇది తెలిసిన వాళ్ళే చేసి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి