iDreamPost

నడిరోడ్డుపై యువతుల వీరంగం! ఏకంగా పోలీసులకే ధమ్కీ ఇచ్చారు!

  • Published May 10, 2024 | 2:09 PMUpdated May 10, 2024 | 2:09 PM

తాజాగా ముగ్గురు అమ్మాయిలు ఫుల్ గా మద్యం సేవించారు. కాగా, ఆ తర్వాత వారికి మద్యం ఎక్కువ అవ్వడంతో.. నానా రచ్చ చేయడం ప్రారంభించారు. అయితే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుండటంతో పాటు.. ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలిగించడం ప్రారంభించారు. దీంతో విసిగు చెందిన బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇక రెస్టారెంట్ బార్ బయటకు వచ్చిన ఆ ముగ్గురు మహిళలు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. 

తాజాగా ముగ్గురు అమ్మాయిలు ఫుల్ గా మద్యం సేవించారు. కాగా, ఆ తర్వాత వారికి మద్యం ఎక్కువ అవ్వడంతో.. నానా రచ్చ చేయడం ప్రారంభించారు. అయితే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుండటంతో పాటు.. ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలిగించడం ప్రారంభించారు. దీంతో విసిగు చెందిన బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇక రెస్టారెంట్ బార్ బయటకు వచ్చిన ఆ ముగ్గురు మహిళలు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. 

  • Published May 10, 2024 | 2:09 PMUpdated May 10, 2024 | 2:09 PM
నడిరోడ్డుపై యువతుల వీరంగం!  ఏకంగా పోలీసులకే ధమ్కీ ఇచ్చారు!

ఈ మధ్య కాలంలో చాలామంది యువత పీకలదాక మద్యం సేవించి రోడ్డు పై చేస్తున్న హంగామా అంత ఇంత కాదు. ముఖ్యంగా రాత్రి వేళలో అయితే ఫుల్ గా తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు పెడతూ.. నానా రచ్చ చేస్తుంటారు. అయితే ఇలా డ్రంక్ అనే డ్రైవ్ చేస్తూ రోడ్డు పై విచ్చల విడిగా తిరుగే వారిని అడ్డుకున్న పోలీసులతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ.. చుక్కుల చూపిస్తుంటారు. కాగా,ఇలా పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్న వారిలో అబ్బాయిలే ఉన్నారనుకుంటే.. పొరపాటే. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా అందులో ఏమాత్రం తీసిపోమంటూ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొంతమంది అమ్మాయిలు ఫుల్ గా తాగి చేసిన వీరంగం తెలిస్తే షాక్ అవుతారు. అంతేకాకుండా వారిని అడ్డుకున్న పోలీసులపై దాడికి కూడా దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక వీరిని చూస్తే అసలు అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని ముక్కున వేలు వేసుకుంటారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తాజాగా ముంబైలోని గోకుల్ టౌన్‌షిప్‌లోని రెస్టారెంట్ బార్‌లో ముగ్గురు అమ్మాయిలు ఫుల్ గా మద్యం సేవించారు. కాగా, ఆ తర్వాత వారికి మద్యం ఎక్కువ అవ్వడంతో.. నానా రచ్చ చేయడం ప్రారంభించారు. అయితే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుండటంతో పాటు.. ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలిగించడం ప్రారంభించారు. దీంతో విసిగు చెందిన బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇక రెస్టారెంట్ బార్ బయటకు వచ్చిన ఆ ముగ్గురు మహిళలు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు.  దీంతో సదరు యువతులను పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయిన వారు వినకపోగా తిరిగి పోలీసులతో వాగ్వాదంకు దిగారు. ఇక అంతటితో ఆగకుండా పోలీసులను అసభ్య పదాలతో దుర్భాషలాడారు. అంతేకాకుండా.. అందులో ఓ యువతి ఏకంగా మహిళా కానిస్టేబుల్ చేతిని కొరికి గాయపరిచింది.

అలాగే మరో యువతి అక్కడ ఉన్న ఇన్ స్పెక్టర్‌ చొక్కాను పట్టుకుని నానా హంగామా చేసింది. అయితే అతను వదిలించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె వినలేదు. దీంతో అతి కష్టం మీద ఆ ముగ్గురిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అయితే  మద్యం మద్యం సేవించి పబ్లిక్‌ ప్లేస్‌లో న్యూసెన్స్ చేసినందుకు ఆ యువతులపై ఐపీసీ సెక్షన్ 353, 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఆ వీడియోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఆ ముగ్గురు యువతులపై మండిపడుతన్నారు. మరి, ఫుల్ గా మద్యం సేవించిన ముగ్గురు యువతులు పోలీసులపై దాడికి దిగిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి