iDreamPost

ఉగాది నాడు జరిగిన దారుణం! పండుగ రోజు ఇలా చేశావ్ ఏంటమ్మ?

  • Published Apr 10, 2024 | 11:48 AMUpdated Apr 10, 2024 | 12:18 PM

Hyderabad Crime News: పెళ్లై మూడేళ్లు అవుతుంది.. ఏడాదిన్నర పాప ఉంది. ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది.

Hyderabad Crime News: పెళ్లై మూడేళ్లు అవుతుంది.. ఏడాదిన్నర పాప ఉంది. ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది.

  • Published Apr 10, 2024 | 11:48 AMUpdated Apr 10, 2024 | 12:18 PM
ఉగాది నాడు జరిగిన దారుణం! పండుగ రోజు ఇలా చేశావ్ ఏంటమ్మ?

ఇటీవల దేశంలో పలు చోట్లు చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్య సమస్యల కారణంగా మనస్థాపానికి గురై డిప్రేషన్ లోకి వెళ్తున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లేదా తమను తామే అంతం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అత్తింటి వారు వేధిస్తున్నారని కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఓ వివాహిత ఏడాదిన్నర పాప ఉన్న విషయం మరిచి దారుణమైన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. పెళ్లి సమయంలో వధువు తరుపు వారు అనుకున్నంత కట్న కానుకలు సమర్పించిన తర్వాత పెళ్లి తంతు ముగిస్తుంటారు. కానీ కొంతమంది అత్తంటి వారు ఇచ్చిన కట్నం సరిపోలేదని.. అదనపు కట్నం తీసుకురావాలని ఆడ బిడ్డలను వేధింపులకు గురి చేయడం.. అది తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పపడటం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే హైదరాబాద్ శామీర్ పేటలో జరిగింది. ఓ వివాహిత ఫ్యాన్ కి ఉరివేసుకోకిన ఆత్మహత్యకు పాల్పపడటం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా మాల్యాల గ్రామానికి చెందిన చంత రాజేశం, భూమక్కల కూతురు చింత మాధురి (22) కి.. కరీంనగర్ ఎల్ఎండీ కాలనీకి చెందిన వేణుతో మూడేళ్ల క్రితం పెళ్లైంది.

ఉద్యోగం రిత్యా మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేటలో నివాసం ఉంటున్నారు. జినోమ్ వ్యాలీలో ఓ కంపెనీలో వర్క్ చేస్తున్న వేణు, మాధురి పెళ్లైన కొత్తలో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇటీవల మాధురిపై అత్తింటి వేధింపులు మరీ ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం వేణు ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే భార్య ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. ఈ విషయం వేణు తన అత్తమామలకు తెలియజేశాడు. అయితే కొంతకాలంగా తన కూతురుని దారుణంగా హింసిస్తున్నారని.. వారి వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పపడిందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మాధురి అత్తమామలు ఎల్ఎండీ కాలనీలో ఉంటున్నారు. మాధురి ఆత్మహత్యకు పాల్పపడిందా? హత్య చేశారా? అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మాధురికి ఏడాదిన్నర పాప ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి