iDreamPost
android-app
ios-app

వైష్ణవి మృతి.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

వైష్ణవి మృతి.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ 14 ఏళ్ల వైష్ణవి అనే బాలిక మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో గుండెలు పగిలేలా ఏడ్చారు. వీరితో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కంటతడి పెట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు వైష్ణవికి ఏం జరిగింది? ఈ బాలిక ఎలా చనిపోయింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలం చౌదర్ పల్లి గ్రామంలో కిష్ణయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి వైష్ణవి (14) అనే కూతురుంది. ఈ బాలిక స్థానిక మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల వైష్ణవికి జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు నారాయణఖేడ్ లోని ఓ ఆస్పత్రికి చేర్పించారు. అక్కడ చికిత్స అందించారు. కానీ, మెరుగైన చికిత్స కోసం గత నెల 29న హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వైష్ణవికి చికిత్స అందించారు.

అయినా పరిస్థితి విషమించడంతో వైష్ణవి చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక వైష్ణవి మృతదేహాన్ని అంత్యక్రియలకు వారి సొంతూరుకు తీసుకెళ్లారు. దీంతో ఆ విద్యార్థిని చివరి సారిగా చూసేందుకు ఆమె స్నేహితులు, ఉపాధ్యాయులు వైష్ణవిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahisgalabet giriş