iDreamPost
android-app
ios-app

పండగ పూట తీవ్ర విషాదం: తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క!

Mahabubabad News: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగను నిర్వహిస్తారు. అలా అందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా తోబుట్టువులు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి పండగ వేళ విషాదం చోటుచేసుకుంది.

Mahabubabad News: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగను నిర్వహిస్తారు. అలా అందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా తోబుట్టువులు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి పండగ వేళ విషాదం చోటుచేసుకుంది.

పండగ పూట తీవ్ర విషాదం: తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క!

రక్త సంబంధాలను, అనుబంధాలను పంచుకునే పండగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీకగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అలా అందరూ ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా తోబుట్టువులు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అక్క తన సోదరుడికి రాఖీ కట్టి.. చనిపోయింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ తండాకు చెందిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఆ యువతి కోదాడలోని ఓ ప్రైవేటు పాల్ టెక్నిక్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. అయితే గతకొంతకాలంగా ఆ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఆకతాయి వేధింపులను చాలా కాలం భరించిన ఆ యువతి..చివరకు విసుకు చెందింది. ఆకతాయి వేధింపులను ఆ బాలిక తట్టులోకపోయింది. చావే పరిష్కార మార్గంగా భావించి..దారుణ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల క్రితం ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  పురుగుల మందు తాగిన ఆ బాలికను  గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Mahabubabad, Crime News, Telangana, Raksha Bandhan 2

ఈ క్రమంలోనే  రెండ్రోజులుగా బాలిక అక్కడే చికిత్స పొందుతుంది. తాను చనిపోతానని ముందే తెలిసిన ఆ బాలిక తన తమ్ముడికి  రాఖీ కట్టాలని భావించింది.  దీంతో ఆ బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఆమె సోదురుడు సోమవారం ఉదయం వెళ్లాడు. సోమవారం తన తమ్ముడికి ఆ యువతి రాఖీ కట్టింది. తమ్ముడి నుదిటిపై బొట్టుపెట్టి తన ప్రేమను చాటుకుంది. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని సోదరుడి వద్ద మాట తీసుకుంది. అనంతరం కాసేపటికే ఆ బాలిక మరణించింది. ఇలా తాను చనిపోతానని తెలిసి సోదరుడికి చివరిసారిగా రాఖీ కట్టడం అందరినీ కలచి వేసింది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. పండగపూట ఇలా జరగడంతో స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.