iDreamPost
android-app
ios-app

దారుణం: వదినతో మరిది కాపురం! అన్న కళ్ళ ముందే అంతా! ఇద్దరు పిల్లలు కూడా!

  • Published Apr 04, 2024 | 8:53 PM Updated Updated Apr 04, 2024 | 8:53 PM

Relationship Brothers Wife: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. ఇందుకు కారణాలు చాలా వరకు వివాహేతర సంబంధాలే అని అంటున్నారు.

Relationship Brothers Wife: వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడిపోతున్నారు. ఇందుకు కారణాలు చాలా వరకు వివాహేతర సంబంధాలే అని అంటున్నారు.

దారుణం: వదినతో మరిది కాపురం! అన్న కళ్ళ ముందే అంతా! ఇద్దరు పిల్లలు కూడా!

ఈ మధ్య మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేస్తున్నారు.  సమాజంలో అక్రమ సంబంధాల వల్ల ఎన్నో నేరాలు.. ఘోరాలు జరుగుతున్నాయి. పెళ్లైన ఏడాది లోపే భార్యాభర్తల మధ్య ఏర్పడే విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఇదే అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటి ఘోరాలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. మరిది చేసిన అకృత్యాలను వదిన వెలుగులోకి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఓ వివాదాస్పద సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మండంలోని బజ్జుతండా శివారులో చిన్నతండాకు చెందిన జాటోత్ రాజుకు చెన్నారావుపేట మండలంలోని ఎల్లాయగూడేనికి చెందిన మమతను ఇచ్చి 2017 లో వివాహం చేశారు. ఈ జంటకు పిల్లలు పుట్టకపోవడంతో పలు ఆస్పత్రులకు తిరిగారు. ఏ ఆస్పత్రికి తిరిగినా ఒకే సమాధానం.. రాజుకి పిల్లలు పుట్టరు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మమత ఇక తన భర్తతో సంసారం చేయనని పుట్టింటికి వెళ్లిపోయింది.  మమత పుట్టింటికి వెళ్లిపోయిన కొన్నిరోజుల తర్వాత అత్త భద్రమ్మ, మామ నర్సింహ, మరిది శ్రీను ఒక నిర్ణయానికి వచ్చారు. మమత పుట్టింటికి వెళ్లి మళ్లీ ఆస్పత్రుల్లో చూపిస్తామని నమ్మించి ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అత్తింటి వారు దారుణమైన ప్లాన్ వేశారు.

నీ భర్తకు పిల్లలు పుట్టరని తెలిసిందే.. నీ మరిది (శ్రీను) తో కాపురం చేస్తే పిల్లలు పుడతారు. మన ఆస్తులు ఎటూ పోవు.. చుట్టుపక్కల జనాలు కూడా నువు గొడ్రాలివి కాదు అని నమ్ముతారు అంటూ నమ్మించింది. ఇలా వదితో మరిది కాపురం చేస్తూ వస్తున్నాడు. వీరికి ఒక పాప, బాబు జన్మించారు.  ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. పిల్లలు పుట్టిన తర్వాత మమతపై తరుచూ అత్తమామలు, మరిది గొడవ పడుతూ వచ్చారు. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక మమత పుట్టింటికి వెళ్లిపోయింది. అదే సమయంలో శ్రీను వేరు యువతిని పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త మమత చెవిలో పడింది. వెంటనే చిన్న తండాకు వచ్చి శ్రీను కుటుంబాన్ని నిలదీసింది. తనను మోసం చేసి తీరా పిల్లలు పుట్టిన తర్వాత మరో మహిళను ఎలా పెళ్లి చేసుకుంటావని శ్రీను ప్రశ్నించింది మమత. దానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు శ్రీను. దీంతో పోలీసులను ఆశ్రయించింది మమత. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş