సుబ్బయ్య గారి హోటల్లో అగ్నిప్రమాదం! 40 మంది..

  • Author Soma Sekhar Published - 02:38 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Published - 02:38 PM, Wed - 12 July 23
సుబ్బయ్య గారి హోటల్లో అగ్నిప్రమాదం! 40 మంది..

హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రముఖ హోటల్లలో సుబ్బయ్య గారి హోటల్ ఒకటి. సిటీలో ఎన్నో రెస్టారెట్లు ఉన్నా గానీ.. సుబ్బయ్య గారి బుట్ట భోజనానికి ప్రత్యేకంగా భోజన ప్రియులు ఉన్నారంటే అతిశయోక్తికాదు. తాజాగా సుబ్బయ్య గారి హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్లో 40 మంది చిక్కుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సుబ్బయ్య గారి హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ లో మంటలు చెలరేగాయి. దాంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్లో 40 మంది చిక్కుకున్నారు. వారందరిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గత 68 సంవత్సరాలుగా సుబ్బయ్య గారి హోటల్ భోజన ప్రియులకు తన సర్వీస్ ను అందిస్తూ వస్తోంది.

Show comments