ఈ దగ్గు మందును వాడుతున్నారా.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల హెచ్చరిక

Hyderabad: సాధారణంగా ఎవరైనా  సీజనల్ ఇన్​ఫెక్షన్స్  వాళ్ల కానీ, మరి ఏ ఇతర  కారణాల చేతగానీ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో కచ్చితంగా దగ్గు మందు వాడుతుంటారు. కానీ, ఈ దగ్గు మందు వాడితే ప్రాణానికే ప్రమాదమని తాజాగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

Hyderabad: సాధారణంగా ఎవరైనా  సీజనల్ ఇన్​ఫెక్షన్స్  వాళ్ల కానీ, మరి ఏ ఇతర  కారణాల చేతగానీ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో కచ్చితంగా దగ్గు మందు వాడుతుంటారు. కానీ, ఈ దగ్గు మందు వాడితే ప్రాణానికే ప్రమాదమని తాజాగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుతం సీజన్ మారింది. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ భారీ వర్షాల కారణంగా.. చాలామంది జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లడం, స్థానిక మెడికల్ స్టోర్ కి వెళ్లి ట్యాబ్లెట్స్ తో పాటు దగ్గు సిరప్ ను అయితే కచ్చితంగా తీససుకుంటాం. ఇలా ఇళ్లలో చిన్న నుంచి పెద్ద వరకు దగ్గు ఎక్కువగా ఉన్నవారు సిరప్ ను వాడుతుంటారు అనే విషయం తెలిసిందే. కానీ, ఈ మధ్య కాలంలో ఈ దగ్గు సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వీటిని తీసుకోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయని ప్రపంచ దేశాల్లో చాలా కథనాలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఇండియాలో కూడా ఈ దగ్గు మందు వాడితో ప్రాణాలకు ప్రమాదమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధరణంగా దగ్గు వచ్చినప్పుడు ఎవరైనా సరే గ్లైకోరిల్ కాఫ్ సిరప్ను వాడుతారు. కానీ, ఇక నుంచి ఆ గ్లైకోరిల్ కాఫ్ సిరప్ను వాడొద్దని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు. నగరంలో కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో దగ్గు మందును తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తాజాగా దాడులు చేశారు. ఈ మేరకు ఆ కంపెనీలో రూ.65 వేలు విలువ చేసే స్టాక్ ను అధికారులు సీజ్జ చేశారు. ఎందుకంటే.. ఆ కంపెనీలో దగ్గు మందు తయారీలో ఎటువంటి నిబంధనలను పాటించడం లేదని, ఈ దగ్గు మందు వాడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తేల్చారు. ఇలాంటి దగ్గు మందులు ఎక్కడ కనిపించినా తమకు తెలియజేయాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు. ఇండియాలో తయారు చేసిన కాఫ్ సిరప్ లు 141 మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నాయి. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు దగ్గు మందు పేరుతో తయారుచేస్తున్న ఔషధాలు ప్రమాదకరం అని తేలిన విషయం విదితమే. గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లల మరణాలకు ఆ దగ్గు మందులే కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2022లోనే తేల్చి చెప్పింది. అప్పటి నుంచి భారత్ లో తయారవుతున్న దగ్గు మందులపై కేంద్ర ప్రభుత్వం, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలను గాలికొదిలేసి దగ్గు మందు పేరుతో ప్రమాదకరమైన ఔషధాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

Show comments