iDreamPost
android-app
ios-app

కామారెడ్డిలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన 200 గేదెలు!

కామారెడ్డిలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన 200 గేదెలు!

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భీమేశ్వర వాగు ఉప్పొంగింది. ఈ వరద నీటిలో ఏకంగా 200 గేదెలు కొట్టుకుపోయాయి. రైతులు, గ్రామస్తులు అప్రమత్తమై ఆ గేదెలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక అతి కష్టంగా 100 గేదెలను కాపాడగా.., మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ మారుతుంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. జిల్లాలోని తాడ్వాయి మండలం సత్వాయిపేటలోని ఇటీవల కురిసిన వర్షాలకు భీమేశ్వర వాగు ఉప్పొంగింది. ఈ వరద నీరు దిగువ ప్రాంతాల వైపు వెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే గురువారం చిట్యాల, సంతాయిపేట గ్రామ రైతులు పశువులను మేత కోసం అడవికి తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఆ గేదెలను తిరిగి తీసుకొస్తున్న క్రమంలో ఉప్పొంగి వస్తున్న ఆ వాగు నీటిలో దాదాపు 200 గేదెలు కొట్టుకుపోయాయి. రైతులు కేకలు వేయడంతో గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

వాగులో కొట్టుకుపోతున్న ఆ గేదెలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే 100 గేదెలను రక్షించారు. మిగిలిన వాటి కోసం రైతులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఆ గేదెలు వాగులో కొట్టుకుపోతుండగా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇవే దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark giriştimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş