VIDEO: రోహిత్‌ సెంచరీ తర్వాత కోహ్లీ రియాక్షన్‌ చూడండి!

టీమిండియాలో ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు. ఒకరు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మరొకరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇద్దరూ ప్రస్తుతం ఉన్న మోడ్రన్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లు. నిరంతరం పరుగుల దాహంతో ఉంటారు. అయితే.. కోహ్లీకి, రోహిత్‌కి అస్సలు పడదని, ఇద్దరూ రెండు గ్యాంగ్స్‌ మెయింటేన్‌ చేస్తుంటారని, ఏదో పైకి అలా బాగున్నట్లు ఉన్నా.. లోపల మాత్రం ఒకరంటే ఒకరికి అస్సలు పడదనే అభిప్రాయం చాలా మందికి ఉంది. అనేక సందర్భాల్లో వారిద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న రెస్పెక్ట్‌, అఫెక్షన్‌ చూపిస్తున్నా కానీ, కొంతమంది వాటిన నటనగా కొట్టిపారేస్తున్నారు. జట్టుపై ఆధిపత్యం చెలాయించే విషయంలో ఇద్దరి మధ్య పోటీ ఉందని అర్థం లేని వాదనలు చేస్తుంటారు.

అయితే.. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. 273 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. మొదటి నుంచి హిట్టింగ్‌తో ఆఫ్ఘాన్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. దీంతో టీమిండియా 35 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి మెరుగైన రన్‌రేట్‌ను సొంతం చేసుకుంది. రోహిత్‌ శర్మ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సులతో 131 పరుగులతో అదరగొట్టాడు. అయితే.. రోహిత్‌ శర్మ సెంచరీ పూర్తి చేయగానే.. డ్రెస్సింగ్‌రూమ్‌లోని ఆటగాళ్లంతా లేచి నిలబడి మరీ రోహిత్‌కు అభినందనలు తెలిపారు.

అప్పటికే ప్యాడ్లు కట్టుకుని ఉన్న కోహ్లీ సైతం అందరికంటే ఎక్కువగా సంతోషం వ్యక్తం చేస్తూ.. చప్పట్లతో రోహిత్‌ను అభినందిస్తూ కనిపించాడు. రోహిత్‌ సెంచరీ తర్వాత కోహ్లీ రియాక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లీ అనే కాదు.. రోహిత్‌ శర్మ సైతం కోహ్లీ ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు.. కోహ్లీకి హ్యాట్సాఫ్‌ అంటూ మ్యాచ్‌ తర్వాత చెప్పాడు. అంతకు ముందు టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ తర్వాత.. కోహ్లీని ఏకంగా ఎత్తుకుని మరీ రోహిత్‌ తన ప్రేమను చాటుకున్నాడు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు తమ గౌరవం ఇష్టం చాటుకుంటున్నారు. ఇప్పుడు కోహ్లీ రియాక్షన్స్‌తో అది మరోసారి రుజువైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చివరి వరల్డ్ కప్ లో రెచ్చిపోతున్న డికాక్.. వరసగా రెండో సెంచరీ

Show comments