iDreamPost
android-app
ios-app

రోహిత్‌ చేయి పట్టుకుని బతిమాలి.. తీసుకెళ్లిన కోహ్లీ! సీక్రెట్‌ వీడియో బయటికి..

  • Published Jul 10, 2024 | 12:07 PMUpdated Jul 10, 2024 | 12:07 PM

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో ముంబైలో భారత జట్టు విక్టరీ పరేడ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో రోహిత్‌, కోహ్లీ మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో ముంబైలో భారత జట్టు విక్టరీ పరేడ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో రోహిత్‌, కోహ్లీ మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 10, 2024 | 12:07 PMUpdated Jul 10, 2024 | 12:07 PM
రోహిత్‌ చేయి పట్టుకుని బతిమాలి.. తీసుకెళ్లిన కోహ్లీ! సీక్రెట్‌ వీడియో బయటికి..

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్‌ బాండింగ్‌ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటపడింది. నిజానికి కోహ్లీ, రోహిత్‌కు అస్సలు పడదని, వాళ్లిద్దరూ రెండు వేర్వేరు గ్రూపులు నడిపిస్తుంటారని చాలా పుకార్లు ఉన్నాయి. కానీ, సమయం వచ్చిన ప్రతీ సారి.. అవన్నీ నిజం కాదని వాళ్ల ప్రత్యేకమైన అనుబంధంతో నిరూపించే వాళ్లు కోహ్లీ అండ్‌ రోహిత్‌. టీమ్‌కు అవసరమైన సమయంలో ఇద్దరు కూడా తమ వందశాతం ఎఫర్ట్‌ ఇస్తారు. తొలుత కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్‌ ఆడితే.. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్సీలో కోహ్లీ ఆడుతున్నాడు. ఎవరి కెప్టెన్సీలో ఎవరు ఆడినా.. ఇద్దరి టార్గెట్‌ ఒక్కటే ఇండియా గెలవాలి. తాజాగా ఇద్దరూ కలిసి టీ20 వరల్డ్‌ కప్‌ ఎత్తిన విషయం తెలిసిందే.

గత 15 ఏళ్లుగా వరల్డ్‌ కప్‌ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఇన్నేళ్లకు మా కల నేరవేరిందని కోహ్లీనే స్వయంగా చెప్పాడు. అయితే.. వరల్డ్‌ కప్‌ గెలిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే క్రికెట్‌ స్టేడియం వరకు భారీ సంఖ్యలో హాజరైన క్రికెట్‌ అభిమానుల మధ్య ఈ విక్టరీ పరేడ్‌ జరిగింది. ఈ పరేడ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది.

ఆ వీడియోలో.. విరాట్‌ కోహ్లీ రోహిత్‌ శర్మ దగ్గరికి వచ్చి వరల్డ్‌ కప్‌తో కలిసి ఇద్దరం ఫొటో దిగుదాం అని అని రోహిత్‌ చేయి పట్టుకుని మరీ బతిమిలాడి తీసుకుని వెళ్లాడు కోహ్లీ. ఎక్కడికి, ఎందుకు అని అడుగుతున్నా.. నువ్వు రా ముందు అంటూ తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టుకున్న సెల్ఫీ స్టిక్‌ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఆ వీడియోను తాజాగా ముంబై ఇండియన్స్‌ తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. రోహిత్‌ రాను అంటున్నా.. కోహ్లీ బలవంతంగా చేయి పట్టకుని మరీ అతన్ని లాక్కెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వీడియోలో కోహ్లీ, రోహిత్‌ బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి