iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ వారసుడు ఎవరో తేల్చేసిన BCCI.. వచ్చే వరల్డ్ కప్​ వరకు అతడే కెప్టెన్!

  • Published Jul 17, 2024 | 9:40 AMUpdated Jul 17, 2024 | 9:52 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్​లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్​లో హిట్​మ్యాన్​లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్​లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్​లో హిట్​మ్యాన్​లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Published Jul 17, 2024 | 9:40 AMUpdated Jul 17, 2024 | 9:52 AM
Rohit Sharma: రోహిత్ వారసుడు ఎవరో తేల్చేసిన BCCI.. వచ్చే వరల్డ్ కప్​ వరకు అతడే కెప్టెన్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వారసుడు ఎవరు? భారత క్రికెట్​లో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. టీ20, వన్డే క్రికెట్​లో హిట్​మ్యాన్​లా సమర్థవంతంగా జట్టును ఎవరు నడిపించగలరు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీ20 వరల్డ్ కప్​తో పొట్టి ఫార్మాట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు హిట్​మ్యాన్. వచ్చే సంవత్సరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డేలకూ అతడు గుడ్​బై చెప్పే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అతడికి వారసుడ్ని వెతికే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. టెంపరరీగా ఒకట్రెండు సిరీస్​లకు కాకుండా పూర్తి స్థాయి సారథిని నియమించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఆల్రెడీ ఓ ప్లేయర్​ను కూడా సెలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను రోహిత్ వారసుడుగా బీసీసీఐ డిసైడ్ అయిందని వినికిడి. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శుబ్​మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఇతర ఆప్షన్లు ఉన్నా సూర్యనే సారథిగా చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. హార్దిక్ నిత్యం గాయాలతో సావాసం చేస్తుంటాడు, ఈ మధ్యే కమ్​బ్యాక్ ఇచ్చిన పంత్ కంటే కెప్టెన్​గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మిస్టర్ 360 బెటర్ అని బీసీసీఐ అనుకుంటోందట. ఇంక గిల్, గైక్వాడ్ టీ20 టీమ్​లో ఇంకా సెటిల్ అవ్వలేదు. కాబట్టి వాళ్లకు సారథ్యం ఇవ్వడం తొందరపాటు అవుతుందని భావిస్తోందట. గతంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​ల్లో కెప్టెన్​గా సూర్య తానేంటో ప్రూవ్ చేసుకోవడం కూడా అతడికి బిగ్ ప్లస్​గా మారిందట. ఉన్న ఆప్షన్స్​లో బెస్ట్ సూర్యనే అని బీసీసీఐతో పాటు కొత్త కోచ్ గౌతం గంభీర్​ కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Rohith Sharma

ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అక్కడ వన్డేలతో పాటు టీ20లు కూడా ఆడనుంది. ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే వన్డేలకు ఓ తాత్కాలిక సారథిని నియమించాల్సి ఉంటుంది. అయితే టీ20లకు మాత్రం పూర్తిస్థాయి కెప్టెన్​ను ఎంపిక చేయాలి. అందుకే గంభీర్​తో పాటు సెలెక్టర్లతో డిస్కస్ చేసిన బీసీసీఐ పెద్దలు సూర్యకుమార్​ను ఆ రోల్​కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారట. త్వరలో సూర్య పేరును అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ వరకు అతడే కెప్టెన్​గా ఉంటాడని సమాచారం. అయితే బోర్డు నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. మరి.. సూర్యకుమార్ కెప్టెన్​గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి