iDreamPost

వీడియో: భారత క్రికెటర్లతో ప్రధాని మోదీ మాట్లాడిన పూర్తి వీడియో రిలీజ్‌!

  • Published Jul 05, 2024 | 5:13 PMUpdated Jul 05, 2024 | 5:13 PM

PM Modi, Team India, T20 World Cup 2024, Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఆటగాళ్లను నవ్వుల్లో ముంచెత్తారు. అలాగే కొంతమంది ఆటగాళ్లు ఎమోషనల్‌ అయ్యారు. ఆ పూర్తి మీ కోసం..

PM Modi, Team India, T20 World Cup 2024, Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఆటగాళ్లను నవ్వుల్లో ముంచెత్తారు. అలాగే కొంతమంది ఆటగాళ్లు ఎమోషనల్‌ అయ్యారు. ఆ పూర్తి మీ కోసం..

  • Published Jul 05, 2024 | 5:13 PMUpdated Jul 05, 2024 | 5:13 PM
వీడియో: భారత క్రికెటర్లతో ప్రధాని మోదీ మాట్లాడిన పూర్తి వీడియో రిలీజ్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించిన భారత జట్టు.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. జూన్‌ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. వెస్టిండీస్‌లో హరికేన్‌ తుపాన్‌ కారణంగా భారత జట్టు గురువారం ఉదయం తిరిగి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో దిగిన భారత జట్టుకు క్రికెట్‌ అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు.. ఫ్రెష్‌అప్‌ అయి.. ప్రధాని మోదీతో కలిసేందుకు వెళ్లారు.

ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. ఆ సమయంలో ఆటగాళ్లతో చాలా సేపు ముచ్చటించిన ప్రధాని మోదీ పలు విషయాల గురించి వారితో మాట్లాడుతూ నవ్వులు పూయించారు. అలాగే కొంత మంది ఆటగాళ్లు ఎమోషనల్‌ అయ్యారు. అయితే.. మోదీని కలిసిన సయమంలో ఆటగాళ్లు ఎలాంటి విషయాలు పంచుకున్నారు, ఏం మాట్లాడారో తెలియలేదు. తాజాగా పూర్తి వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి