ఆసీస్‌తో సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లకు రెస్ట్‌ ఇవ్వడం వెనుక ప్లాన్‌ ఇదేనా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ముందు ఆస్ట్రేలియాతో కీలక సిరీస్‌కు సిద్ధమవుతుంది టీమిండియా. ఈ నెల 22 నుంచి 27 వరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌ జరగనుంది. దీంతో వరల్డ్‌ కప్‌కు ముందు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఎంతో కీలకం కానుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో వరల్డ్‌ కప్‌ ముందు మూడు వన్డేలు ఆడటంతో టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌ లభించనుంది. అయితే.. ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సోమవారం రాత్రి భారత జట్టును ప్రకటించారు.

అనూహ్యంగా ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాలకు రెస్ట్‌ ఇచ్చారు. హార్దిక్‌ పాండ్యా విషయం పక్కనపెడితే.. రోహిత్‌, కోహ్లీలకు రెస్ట్‌ ఇవ్వడంపై క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై ఆడితే.. వరల్డ్‌ కప్‌కు ముందు మంచి ప్రాక్టీస్‌ లభించేంది కదా? ఎందుకు రెస్ట్‌ ఇచ్చారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. రోహిత్‌, కోహ్లీలకు రెస్ట్‌ ఇవ్వడం వెనుక ప్లాన్‌ వేరే ఉందని సమాచారం.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు ఆస్ట్రేలియాతో ఆడిన అనుభవం చాలా ఉంది. పైగా ఆ జట్టులో కొత్త బౌలర్లు కూడా ఎవరూ లేరు. ఉన్న వారందర్ని కోహ్లీ, రోహిత్‌ ఇప్పటికే అనేక సార్లు ఎదుర్కొని ఉన్నారు. వీళ్లిద్దరూ రెస్ట్‌ తీసుకోవడంతో.. ఆసీస్‌ లాంటి పెద్ద టీమ్‌తో టీమిండియాలోని యువ క్రికెటర్లకు ఎక్కువ గేమ్‌ టైమ్‌ దొరుకుతుంది. ఒక వేళ మ్యాచ్‌ బాగా క్లిష్టంగా వెళ్లినా కూడా.. ఒత్తిడిలో ఎలా ఆడాలో గిల్‌, ఇషాన్‌తో పాటు మరి కొంతమంది కీలక ఆటగాళ్లు తెలిసి వస్తుంది. అలాగే.. రోహిత్‌, కోహ్లీ, పాండ్యా ఎంత ముఖ్యమైన ఆటగాళ్లో తెలిసిందే. అలాంటి వాళ్లు వరల్డ్‌ కప్‌ ముందు గాయపడితే.. టీమ్‌కు ఎంతో నష్టం చేస్తుంది. అందుకే ఆస్ట్రేలియాతో సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు వాళ్లని దూరం పెట్టినట్లు క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యువీ 6 సిక్సుల విధ్వంసానికి 16 ఏళ్లు పూర్తి! గెలికి మరీ కొట్టించుకున్నారు..

Show comments