iDreamPost
android-app
ios-app

IND vs ENG: రెండో టెస్టు గెలిచిన భారత్​కు గుడ్​న్యూస్.. మనల్ని ఎవడ్రా ఆపేది!

  • Published Feb 05, 2024 | 4:58 PM Updated Updated Feb 05, 2024 | 4:58 PM

వైజాగ్ టెస్టులో గెలవడంతో ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. ఈ తరుణంలో మన జట్టుకు సూపర్బ్ న్యూస్. అది విన్న ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేదని అంటున్నారు.

వైజాగ్ టెస్టులో గెలవడంతో ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. ఈ తరుణంలో మన జట్టుకు సూపర్బ్ న్యూస్. అది విన్న ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేదని అంటున్నారు.

  • Published Feb 05, 2024 | 4:58 PMUpdated Feb 05, 2024 | 4:58 PM
IND vs ENG: రెండో టెస్టు గెలిచిన భారత్​కు గుడ్​న్యూస్.. మనల్ని ఎవడ్రా ఆపేది!

ఇంగ్లండ్​తో రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలి టెస్టులో గెలుపునకు దగ్గరగా వచ్చి ఓటమిపాలైన భారత్ ఈసారి మాత్రం ఇంగ్లీష్ టీమ్​ను వదల్లేదు. 106 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ నిర్దేశించిన 399 పరుగులను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే టాప్ స్కోరర్​గా నిలిచాడు. భారత బౌలర్లలో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తలో 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ కలిపి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే సెకండ్ టెస్ట్ నెగ్గి ఫుల్ జోష్​లో ఉన్న టీమిండియాకు మరో గుడ్ న్యూస్. రోహిత్ సేన ర్యాంకింగ్స్​లో సత్తా చాటింది.

ఇంగ్లండ్​పై రెండో టెస్టులో విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది భారత్. ఈ టేబుల్​లో ఆస్ట్రేలియా 66 పాయింట్లతో మొదటి ప్లేసులో ఉండగా.. భారత్ 38 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా (12), న్యూజిలాండ్ (12), బంగ్లాదేశ్ (12) ఉన్నాయి. ఇంగ్లండ్​పై విక్టరీతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 2కు చేరుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్​ను ఆపడం ఎవరి తరం కాదని.. రోహిత్ సేన పవర్ ఇదని అంటున్నారు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్​కు క్వాలిఫై అవ్వాలంటే ఇంగ్లండ్​తో మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడే నంబర్ వన్ ర్యాంక్ సొంతమవుతుంది. సొంతగడ్డపై జరిగే మ్యాచుల్లో నెగ్గితే విదేశాల్లో జరిగే టెస్టుల సమయంలో టీమ్​పై అంత ఒత్తిడి ఉండదని అనలిస్టులు అంటున్నారు.

ఇక, వైజాగ్ టెస్టులో భారత్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్​కు చావుదెబ్బ కొట్టింది. వాళ్ల బజ్​బాల్​ క్రికెట్​కు తొలి ఇన్నింగ్స్​లో యష్​బాల్​ను కౌంటర్​గా వాడింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో ఇంగ్లీష్ టీమ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్​లో విధ్వంసం సృష్టించాడు. అతడి ధాటికి ఆ జట్టుకు 255 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్​లో భారత్​ను త్వరగా ఆలౌట్ చేసి గెలుద్దామనుకున్న ఇంగ్లండ్​ ఆశలపై శుబ్​మన్ గిల్ నీళ్లు పోశాడు. అతడు సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. 398 పరుగుల బిగ్ ఛేజింగ్​కు దిగిన స్టోక్స్ సేన 600 స్కోరైనా సరే చేరుకుంటామని బీరాలు పోయింది. కానీ అశ్విన్, బుమ్రా చెరో 3 వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్​ను 292 పరుగులు దాటనివ్వలేదు. మరి.. భారత్ టెస్టు ర్యాంకింగ్స్​లో దూసుకుపోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.