iDreamPost
android-app
ios-app

సంజూ శాంసన్​కు శని ఇలా పట్టుకుందేంటి? ఒకేసారి రెండు ఛాన్సులు మిస్!

  • Author singhj Published - 03:41 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 03:41 PM, Tue - 19 September 23
సంజూ శాంసన్​కు శని ఇలా పట్టుకుందేంటి? ఒకేసారి రెండు ఛాన్సులు మిస్!

వన్డే వరల్డ్ కప్​కు ముంగిట ఆసియా కప్​ను దక్కించుకొని ఫుల్ జోష్​లో ఉంది టీమిండియా. ఇప్పుడు మరో సిరీస్​తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్​లో ఆడే టీమిండియా జట్టును ప్రకటించింది. ఇందులో రెండు వన్డేలకు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఆసియా కప్​ సూపర్-4 దశలో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో గాయపడిన అక్షర్ పేటల్​ను ఆసీస్​తో తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతడి ప్లేసులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ను జట్టులోకి తీసుకున్నారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​లో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కింది. ఈ సిరీస్​లో తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చారు. ఆ మ్యాచ్​లకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేలో హిట్​మ్యాన్ తిరిగి జట్టు పగ్గాలు చేపడతాడు. మూడో వన్డేకు కోహ్లీ, పాండ్యా అందుబాటులో ఉంటారు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్​కు స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్​ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అదృష్టానికి ఆమడ దూరంలో నిలబడే ఈ యంగ్ బ్యాటర్​కు మరోమారు సెలెక్టర్ల నుంచి మొండిచేయి ఎదురైంది. ఎంతో ప్రతిభ కలిగిన సంజూ కెరీర్ మొదట్లో ధోని కారణంగా వైట్ బాల్ క్రికెట్​లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత పంత్, ఇషాన్, రాహుల్ కారణంగా తుది జట్టులో ప్లేస్ దొరకట్లేదు.

వచ్చిన అరకొర ఛాన్సులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు సంజూ శాంసన్. దీంతో అతడు టీమ్​లో నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాజాగా ఆసీస్​తో సిరీస్​కు అతడ్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్​లో జరిగే కౌంటీ మ్యాచుల్లో ఆడే ఛాన్స్ సంజూకు దక్కింది. అటు కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ ఖాయమవుతుండగా.. ఆసియా కప్-2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్​గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో కౌంటీల్లో ఆడాలనే ఆలోచనను ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విరమించుకున్నాడు. ఒకవేళ కేఎల్ రాహుల్ కోలుకోకపోతే వన్డే ప్రపంచ కప్​ టోర్నీకి రిజర్వ్ ప్లేయర్​గా సంజూను ఆడించాలని సెలక్షన్ కమిటీ అనుకుందని సమాచారం.

చైనాలో జరగాల్సిన ఆడియా క్రీడలకు ఈ కారణం వల్లే సంజూను ఎంపిక చేయలేదట. కానీ రాహుల్ ఫుల్​ ఫిట్​నెస్ సాధించడం, ఇషాన్ మిడిలార్డర్​లో కుదురుకోవడంతో సంజూ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇప్పుడు ఆసీస్​తో వన్డే సిరీస్​కు అతడికి టీమ్​లో ప్లేస్ దక్కలేదు. వన్డేల్లో వరుసగా ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్​కు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్న టీమ్ మేనేజ్​మెంట్ సంజూను పట్టించుకోకపోవడం గమనార్హం. ఒకవైపు అతడికి కౌంటీల్లో ఆడే ఛాన్స్ పోవడం, మరోవైపు ఆసీస్​తో సిరీస్​లోనూ చోటు దొరక్కపోవడంతో సంజూ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు. ఈ సిరీస్​కు భారత జట్టును ప్రకటించాక.. సంజూ తన ఫేస్​బుక్ అకౌంట్​లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నవ్వుతున్న ఎమోజీని ఎఫ్​బీలో పోస్ట్ చేశాడు సంజూ.

ఇదీ చదవండి: దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే టీమ్​లోకి అశ్విన్.. రోహిత్ ప్లాన్ ఏంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి