Hardik Pandya Out Prasidh Krishna In Team India: హార్దిక్ పోయె.. ప్రసిధ్ వచ్చే.. యంగ్ ప్లేయర్​కు కలసిరాని తిరుమల సెంటిమెంట్!

హార్దిక్ పోయె.. ప్రసిధ్ వచ్చే.. యంగ్ ప్లేయర్​కు కలసిరాని తిరుమల సెంటిమెంట్!

  • Author singhj Published - 08:42 PM, Sat - 4 November 23

వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్​కు ముందు భారత్​కు భారీ షాక్ తగిలింది. ఇంజ్యురీతో బాధపడుతున్న ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పోయి అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్​ కృష్ణ వచ్చాడు. అయితే పాండ్యా స్థానంలో చోటు ఆశించిన ఒక ప్లేయర్​కు భంగపాటు తప్పలేదు.

వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్​కు ముందు భారత్​కు భారీ షాక్ తగిలింది. ఇంజ్యురీతో బాధపడుతున్న ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ పోయి అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్​ కృష్ణ వచ్చాడు. అయితే పాండ్యా స్థానంలో చోటు ఆశించిన ఒక ప్లేయర్​కు భంగపాటు తప్పలేదు.

  • Author singhj Published - 08:42 PM, Sat - 4 November 23

వన్డే ప్రపంచ కప్-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న భారత జట్టు.. లీగ్ దశలో మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి సౌతాఫ్రికాతో కాగా.. మరొకటి నెదర్లాండ్స్​తో ఉంది. ఆల్రెడీ సెమీస్​కు క్వాలిఫై అయినందున ఈ రెండు మ్యాచులు రోహిత్ సేనకు నామమాత్రం కానున్నాయి. అయితే విన్నింగ్ స్ట్రీక్​ను కంటిన్యూ చేయాలంటే ఈ రెండింట్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. అయితే సౌతాఫ్రికా, డచ్ టీమ్​తో ఆడాల్సిన మ్యాచుల కంటే సెమీఫైనల్ మీదే భారత్ ఫోకస్ చేస్తోంది. ఆ మ్యాచ్​లో గెలిస్తేనే ఫైనల్ చేరుకుంటాం కాబట్టి కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్​ల దృష్టి ఆ మ్యాచ్ మీదే ఉంది.

సెమీస్​ కోసం వ్యూహాలు పన్నుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజ్యురీ కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో గాయపడ్డ హార్దిక్ ఇంకా కోలుకోలేదు. అతడి గాయం తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఎక్కువ కాలం రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్​మెంట్ భావించిందట. ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేకపోవడంతో వరల్డ్ కప్ నుంచి హార్దిక్​ను పూర్తిగా తప్పించింది. అతడి ప్లేసులో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను రీప్లేస్ చేసింది. అయితే తనకు బదులు ప్రసిధ్​ను తీసుకోవడంపై ఒక స్టార్ ప్లేయర్ అసంతృప్తితో ఉన్నట్లు టాక్. గాయపడిన హార్దిక్ ప్లేసులో స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​కు చోటు దక్కలేదు.

అక్షర్​ పటేల్​కు బదులు ప్రసిధ్​ కృష్ణను తీసుకున్నారు. దీంతో అక్షర్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​ చేయగల సత్తా ఉన్న అక్షర్​ను తీసుకోకపోవడం తప్పని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అక్షర్​కు తిరుమల సెంటిమెంట్ కలసిరాలేదని అంటున్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​తో కలసి రీసెంట్​గా తిరుమలను విజిట్ చేశాడు అక్షర్. అయితే దైవదర్శనం తర్వాత టీమ్​లోకి వస్తాడనుకుంటే.. అతడికి బదులు ప్రసిధ్​కు ఛాన్స్ వచ్చింది. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని కొందరు ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అశ్విన్, జడేజా రూపంలో ఆల్రెడీ స్పిన్ ఆల్​రౌండర్లు ఉన్నారు కాబట్టి అక్షర్​కు ఛాన్స్ ఇవ్వలేదని అంటున్నారు. మరి.. హార్దిక్ ప్లేసులో ప్రసిధ్​ను తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ICC టోర్నీల్లో భారత్​కు శాపంగా మారిన గాయాలు.. హార్దిక్​దే ఫస్ట్ కాదు..!

Show comments