iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే!

  • Published Aug 27, 2024 | 10:29 AM Updated Updated Aug 27, 2024 | 11:00 AM

Purushothamudu Movie OTT Release Date: ఈ వారంప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఓ తెలుగు మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Purushothamudu Movie OTT Release Date: ఈ వారంప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఓ తెలుగు మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 27, 2024 | 10:29 AMUpdated Aug 27, 2024 | 11:00 AM
రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే!

సాధారణంగా ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నిటిని ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. కానీ వాటిలో ఎక్కువ శాతం తెలుగు సినిమాల కోసమే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం కూడా అలాంటి తెలుగు సినిమాలే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా.. ఓ తెలుగు సినిమా ఓటీటీ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో.. ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

రాజ్ తరుణ్ నటించిన రీసెంట్ మూవీ పురుషోత్తముడు. రాజ్ తరుణ్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు, కనీసం ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కు బ్రేక్ ఇస్తుందేమో అని అనుకున్నారు కానీ అది జరగలేదు. జూలై 26 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపొయింది . ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. ఆహా సొంతం చేసుకోగా.. ఆగస్ట్ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్నీ “ధైర్యానికి ఉన్న శక్తిని చూసేందుకు రెడీగా ఉండండి. ఆగస్టు 29న పురుషోత్తముడు ఆహాలో ప్రీమియర్ కానుంది” అంటూ ఆహా ట్వీట్ చేసింది. మరి ఈ మూవీ కనీసం ఓటీటీ ప్రేక్షకులనైనా మెప్పిస్తుందేమో వేచి చూడాలి.

Raj Tarun Purushottamudu Movie OTT Streaming Date Fix

ఇక పురుషోత్తముడు కథ విషయానికొస్తే.. ఈ మూవీలో హీరో ఓ కోటీశ్వరుడు కొడుకు.. లండన్ లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. దీనితో అతని తండ్రి కొడుకుకు తన కంపనీ భాద్యతలు అప్పగించాలని అనుకుంటాడు. కానీ దానికి రమ్య కృష్ణ అడ్డు చెప్తుంది. ఆ కంపెనీ రూల్ ప్రకారం.. సీఈఓ కాబోయే వ్యక్తి 100 రోజులు ఓ సామాన్యుడిలా బ్రతకాలనే కండిషన్ పెడుతుంది. దీనితో హీరో సిటీ కి దూరంగా రాయపులంక అనే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అతను అనుకున్నది సాదించాడా లేదా ? ఈ క్రమంలో అతనికి, హీరోయిన్ కు ఎలా పరిచయం ఏర్పడింది ? అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.