iDreamPost
android-app
ios-app

రోజురోజుకీ తగ్గిపోతున్న వందేభారత్ రైలు వేగం.. మూడేళ్ల ఎంత తగ్గిందంటే?

  • Published Jun 08, 2024 | 6:25 PMUpdated Jun 08, 2024 | 6:25 PM

భారత దేశంలో రైల్వే రవాణా వ్యవస్థతను మరింత మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వందే భారత్ రైళ్ల వేగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

భారత దేశంలో రైల్వే రవాణా వ్యవస్థతను మరింత మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వందే భారత్ రైళ్ల వేగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 08, 2024 | 6:25 PMUpdated Jun 08, 2024 | 6:25 PM
రోజురోజుకీ తగ్గిపోతున్న వందేభారత్ రైలు వేగం.. మూడేళ్ల ఎంత తగ్గిందంటే?

దేశంలోని అతి పెద్ద రవాణ వ్యవస్థలో రైల్వే శాఖ కూడా ఒకటి. అయితే ఈ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుగా వేగవంతం చేయడానికి భారతీయ రైల్వే శాఖ గతంల ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిందది. కాగా, ఇప్పటికే ఈ వందే భారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల జోరు పెరిగిందనే చెప్పవచ్చు. ఇక ప్రయాణికుల గురించి ఎంతో సౌకర్య వంతగా సెమీ హైస్పీడ తో ప్రధాని రేంద్ర మోడీ ఈ వందే భారత్ రైల్లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఇక ఈ రైల్లు అందుబాటులోకి వచ్చిన నుంచి ఏ నగరాలకైన వెళ్లాలంటే.. ప్రయాణం చాలా సులభంతరం అవుతుంది. దీంతో ప్రయాణికులు కూడా ఈ వందే భారత్ రైళ్లలో ప్రయాణించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఈ వందే భారత్ రైళ్ల వేగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

భారత దేశంలో రైల్వే రవాణా వ్యవస్థతను మరింత మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వందే భారత్ రైళ్ల వేగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకి అదేమిటంటే.. వందేభారత రైళ్ల వేగం గత మూడేళ్లలో నుంచి ఇప్పటికి బాగా తగ్గిపోయినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడయ్యింది. ఇక ఈ వందే భారత్ రైళ్ల గురించి మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానమిచ్చారు. అయితే ఈ వందే భారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కిలోమీటర్ల ఉండేదని, కానీ 2023-24 నాటికి 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ మేరకు వెల్లడించారు.

ఇకపోతే కేవలం కేవలం వందేభారత్‌ రైళ్లే మాత్రమే కాదని, వివిధ మార్గాల్లో ట్రాక్‌ల పునరుద్ధరణ,స్టేషన్ల ఆధునికీకరణ పనులతో సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని తెలిపారు. అంతేకాకుండా.. కఠిన పరిస్థితుల్లో ఈ వందే భారత్ రైళ్లు నటుస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అక్కడి వాతవరణ పరిస్థితులు, ట్రాక్‌ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. అయితే ఈ వందే భారత రైళ్ల సరాసరి వేగం 2020-21లో గంటకు 84.48 కి.మీ ఉండగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కిలోమీటర్లకు చేరింది. అలాగే 2023-24 నాటికి 76.25 కి.మీ.లకు పడిపోవడం గమనార్హం.ఇక సెమీ-హైస్పీడ్ రైళ్లను 2019 ఫిబ్రవరి 15న తొలిసారిగా అందుబాటులోకి తీసుకురాగా.. అవి గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

కాగా,ఇవి కాస్త ఢిల్లీ, ఆగ్రా రూట్‌లో తప్ప ఇతర మార్గాల్లో గంటకు 130 కి.మీ దాటరాదని హెచ్చరించింది. ఆపై ఢిల్లీ- ఆగ్రా మార్గాన్ని అత్యాధునిక సాంకేతికతతో పునరుద్ధరించడం వల్ల ఆ మార్గంలో వందేభారత్‌ గరిష్ఠ వేగంతో ప్రయాణించే వీలుంది.ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చి ఐదేళ్లు అయినా.. చాలా మార్గాల్లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని ప్రభావమే సాధారణ రైళ్ల వేగంపై కూడా పడుతోంది. ఇక ట్రాక్‌ల ఆధునికీకరణ పూర్తయితే గరిష్ఠంగా 250 కి.మీ. వేగంతో రైళ్లను నడపుతామని ఓ అధికారి తెలిపారు. మరి, వందో భారత్ రైళ్ల వేగం తగ్గడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి