iDreamPost
android-app
ios-app

సూర్యాపేటలో మరో పరువు హత్య… వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని…

సూర్యాపేటలో మరో పరువు హత్య… వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని…

కులాహంకారం మరో ప్రేమికుడి ప్రాణాన్ని బలిగొంది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న పగతో ఆమె అన్నయ్య ఒక యువకుణ్ణి గొంతు కోసి చంపిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని తాళ్ళగడ్డకు చెందిన ఒక యువతి, అదే ఊర్లో ఉంటున్న చందనబోయిన దిలీప్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి అన్నకు ఈ వ్యవహారం నచ్చలేదు. దిలీప్ మీద కోపం పెంచుకున్నాడు. ఓ రోజు మాట్లాడుకుందాం రమ్మని స్థానిక మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువు దగ్గరలోని కట్ట మైసమ్మ గుడి దగ్గరకు పిలిచాడు. దిలీప్ అక్కడికి వెళ్ళాడు. అతనికి, యువతి సోదరుడికి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ క్రమంలోనే యువతి అన్న అతనిపై దాడి చేసి బీరు సీసాతో గొంతు కోసి చంపాడని దిలీప్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం మూడు బృందాలు వెతుకున్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş