iDreamPost
android-app
ios-app

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియకు సుప్రీంకోర్టు కొలీజియం పూనుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను కొలీజియం నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం.. ఈ నెల 29వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నూతన న్యాయమూర్తులను నియమిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది.

కొత్తగా ఎన్నికైన న్యాయమూర్తులు అందరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తార్లాడ రాజశేఖర్‌ రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాతలు న్యాయమూర్తులుగా ఎన్నికైన వారి జాబితాలో ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం న్యాయవాదులుగా పని చేస్తున్నారు.

Also Read : ఆదివారం కూడా విధుల్లో ట్రెజరీ ఉద్యోగులు.. జీతాలు క్లియర్ చేయడంలో బిజీబిజీ!

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis