iDreamPost
android-app
ios-app

అప్పుడు విఠలాచార్య సినిమాలు.. ఇప్పుడు రాద్ధాంతం

అప్పుడు విఠలాచార్య సినిమాలు.. ఇప్పుడు రాద్ధాంతం

ఐదేళ్ల పాలనా కాలంలో రాజధాని పేరుతో మాజీ సీఎం చంద్రబాబు విఠలాచార్య సినిమాలు చూపించారని ఎమ్మెల్సీ, బీజేపీ నేత సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అప్పడు అలా చేసి ఇప్పుడు రాజధాని పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, రాజధాని రెండు వేర్వేరు అంశాలని సోము వ్యాఖ్యానించారు. పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే రాజధాని అని పేర్కొన్నారు. దీనిపై రాద్ధాంతం అనవసరమని వ్యాఖ్యానించారు. వందల కోట్లు వెచ్చిన చంద్రబాబు రాజధాని పేరిట లీకయ్యే భవనాలు కట్టారని విమర్శించారు.

marsbahis giriş