iDreamPost
android-app
ios-app

అశోక్ లేలాండ్ కంపెనీ మీద కేసు పెట్టాలంటా! జేసీ పవన్ రెడ్డి డిమాండ్

  • Published Jun 13, 2020 | 4:03 AM Updated Updated Jun 13, 2020 | 4:03 AM
  • Published Jun 13, 2020 | 4:03 AMUpdated Jun 13, 2020 | 4:03 AM
అశోక్ లేలాండ్ కంపెనీ మీద కేసు పెట్టాలంటా! జేసీ పవన్ రెడ్డి  డిమాండ్

పొడిచిన నేరస్తుడిది కాదు కత్తి అమ్మిన షాప్ వాడిది నేరం అంటున్న జేసీ దివాకర్ తనయుడు పవన్ రెడ్డి

154 వాహనాలకు నకిలీ ఎన్ఓసీలు సమర్పించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి , తనయుడు అస్మిత్ రెడ్డిలను హైదరాబాద్ లోని వారి నివాసంలో అరెస్ట్ చేసి తాడిపత్రి తరలిస్తున్నారని సమాచారం .

వాహనాలను బిఎస్-3 నుండి బిఎస్-4 గా మార్చడం , వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని , పాత వాహనాలని కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయడం వంటి పలు అభియోగాల పై అనంతపురం , తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో ఈ వాహనాల పై ఇప్పటికి 27 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది .

ఆది నుండీ వివాదాలకు అక్రమ రిజిస్ట్రేషన్ , పెర్మిట్లు లేకుండా బస్సులు తిప్పటం పై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసి ట్రావెల్స్ గతంలో కాంగ్రెస్ హయాంలో బస్సు తగలబడి 40 మందికి పైగా సజీవదహనం కాగా , 2017 లో కృష్ణా జిల్లాలో కల్వర్ట్ వద్ద బోల్తా పడి 11 మంది దుర్మరణం చెందారు .కనీసం కేసు కూడా నమోదు చేయకుండా మృత దేహాలు ప్యాక్ చేయటానికి సిద్ధపడగా వైసీపీ అడ్డుపడటం జరిగింది .

Also Read:జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్

అంతే కాక పలు సందర్భాల్లో ట్రావెల్ యాజమాన్యం , సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించినట్లు పలు ఆరోపణలు ఉండగా , ఒక ఘటనలో జేసి ట్రావెల్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలి పట్ల దురుసుగా వ్యవహరించి దుర్భాషలాడటంతో పాటు చేయి చేసుకోగా సూర్యాపేట మిగతా ప్రయాణికులు , పోలీసులు సదరు డ్రైవర్ చేత మహిళా ప్రయాణికురాలి కాళ్ళు పట్టించడం గమనార్హం .

కాగా ఈ అరెస్టుల పై జేసి దివాకర్ రెడ్డి తనయుడు జేసి పవన్ రెడ్డి స్పందిస్తూ తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీ తమని మోసం చేసిందని ఆ కంపెనీ పై చర్య తీసుకోకుండా తమ పై చర్య తీసుకోవడం అనారోగ్యంతో ఉన్న బాబాయ్ ని అరెస్ట్ చేయడం అన్యాయమని విచిత్ర వాదన తెర పైకి తీసుకొచ్చారు . అయితే అశోక్ లేలాండ్ కంపెనీ పాత వాహనలు అమ్మిందా , ఇన్సూరెన్స్ ల చెల్లింపులతో అశోక్ లేలాండ్ కంపెనీకి సంభందం ఏమిటీ , పెర్మిట్స్ లేకుండా వాహనాలు తిప్పటంలో అశోక్ లేలాండ్ పాత్ర ఎందుకుంటుంది , నకిలీ ఎన్వోసీలు కూడా అశోక్ లేలాండ్ కంపెనీనే ఇచ్చిందా , వీటిలో కంపెనీ ప్రమేయం ఉండదు కదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు .

Also Read:అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?

ఏదేమైనా మత్తు డాక్టర్ అరెస్ట్ విషయంలో ఎస్సి , అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో బీసీ కులం కార్డ్ వాడిన టీడీపీ నాయకులకు , జేసీ కుటుంబ సభ్యుల విషయంలో ఆ చాన్స్ లేకపోవడంతో నెపాన్ని వెహికల్ అమ్మటం తప్ప మరే సంభందం లేని అశోక్ లేలాండ్ కంపెనీ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు ఉందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం .

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom