iDreamPost
android-app
ios-app

ఏపీలో తాజాగా 43 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 43 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గడచిన కొన్ని రోజులతో పోలిస్తే కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 43 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1930 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  887 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 999 గా నమోదయింది.గడచిన 24 గంటల్లో కర్నూలులో ఇద్దరు విశాఖలో ఒక్కరు మరణించారు.దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో  9,388 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 43 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా కృష్ణా 16, చిత్తూరులో 11, మందికి కరోనా సోకగా, అనంతపురంలో 3, కర్నూల్ లో 6, విశాఖపట్నంలో 5,గుంటూరులో ఇద్దరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం 43 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom