iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగాలన్ని స్థానికులకే..

  • Published Jul 17, 2024 | 1:35 PM Updated Updated Jul 17, 2024 | 1:35 PM

ఇక ఆ రాష్ట్రంలో స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు వర్తించేలా ముసాయిదా బిల్లును సిద్దం చేసింది.

ఇక ఆ రాష్ట్రంలో స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు వర్తించేలా ముసాయిదా బిల్లును సిద్దం చేసింది.

  • Published Jul 17, 2024 | 1:35 PMUpdated Jul 17, 2024 | 1:35 PM
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక ఉద్యోగాలన్ని స్థానికులకే..

ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్న వాదన ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇప్పటి పలు రాష్ట్రాల్లో దీనిపై చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసకుంది. ప్రవేయిట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మేనేజ్ మెంట్ ఉద్యోగాలలో 50 శాతం, నాన్ మేనేజ్ మెంట్ కేటగిరిలో 75 శాతం రిజర్వేషన్‌లను తప్పనిసరి చేసింది. ఈ బిల్లు ఐటీ సెక్టార్‌తో సహా మొత్తం ప్రైవేట్ రంగాలకు వర్తిస్తుంది. ఇంతకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందంటే.. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయి.

కన్నడిగులకు ప్రాధ్యాన్యతనిచ్చే విధంగా పరిశ్రమలు, కర్మాగాలతో పాటు ఇతర సంస్థల్లో స్థానికులకు 75 శాతం కోటా బిల్లుకు కర్ణాటక క్యాబినేట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ బిల్లు అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు 50శాతం నుంచి 75 శాతం వరకు రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే సీఎం సిద్దరామయ్య కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని, తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారను. అదేవిధంగా రాష్ట్ర వాసులకు ప్రాధాన్యత ఇవ్వని కంపెనీలకు జరిమానాలు కూడా విధించనుంది. బిల్లులో పొందుపరిచిన నిబంధనలను పాటించని కంపెనీలకు రూ. 10 వేల నుండి రూ. 25 వేల వరకు జరిమానా విధించబడుతుంది.

ఇక ఈ బిల్లును గురువారం శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు చుక్కెదురైనట్లే. ఎందుకంటే.. ఇక్కడ ఐటీ కంపెనీల్లో వర్క్ చేసే వారంతా ఎక్కువగా తెలంగాణ, ఏపీ వాసులే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇందులో మరో ట్విస్ట్ ఉంది. ఇక్కడ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే..కొన్నిప్రమాణాలను కూడా బిల్లులో పొందుపరిచారు. కేవలం కన్నడ మాట్లాడితే కన్నడిగ అయిపోరు. ఓ వ్యక్తి రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో నివాసం ఉండి.. రాష్టర్ నోడల్ ఏజెన్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వారినే స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఆయా సంస్థలకు కూడా మినహాయింపులు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. కొన్ని సడలింపులకు అనుమతినిస్తుంది. అన్ని ప్రైవేట్ సంస్థలు గ్రూప్ సి,డి బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం 100 శాతం కన్నడిగులను మాత్రమే నియమించుకోవాల్సి ఉంటుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss