కొత్త రూల్స్‌.. మెట్రోలో ఇలా చేస్తే ఇకపై జైలుకే

కొత్త రూల్స్‌.. మెట్రోలో ఇలా చేస్తే ఇకపై జైలుకే

నగరంలో మెట్రో సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఊరట లభించిన విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ మెట్రో రైళ్లలో అధికారులు కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ఇక మీదట మెట్రోలో ఇలా చేస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా తప్పదు.

నగరంలో మెట్రో సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఊరట లభించిన విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ మెట్రో రైళ్లలో అధికారులు కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ఇక మీదట మెట్రోలో ఇలా చేస్తే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా తప్పదు.

ప్రస్తుతం ఇప్పుడంతా రీల్స్ యుగం నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలామంది యువత ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ ఈ లోకన్నే మార్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ రీల్స్ పేరిట పాపులర్ అవ్వడంతో పాటు ఫాలోవర్స్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో.. చాలామంది వింత వింత ప్రయాత్నాలు, విన్యసాలు చేస్తున్నారు. దీంతో కోరి ప్రమాదాలను తెచ్చుకుంటూ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా..పబ్లిక్ ప్లేస్ ల్లో కూడా ఎదుట వ్యక్తులు ఇబ్బందికి గురియ్యేలా విచక్షణ లేకుండా.. రీల్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా.. మెట్రో రైల్లను సైతం వదలకుండా.. యువత చేస్తున్న రీల్స్ తరుచు సోషల్ మీడియాలో దర్శనమిస్తునే ఉన్నాయి.అయితే ఇలా రీల్స్ పేరిట ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న యూజర్లకు డీఎంఆర్సీ అధికారులు గట్టి షాక్ ను ఇచ్చారు. ఇక మీదట మెట్రోలో ఈ పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషణ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మెట్రో రైల్లలో సోషల్ మీడియా యూజర్స్ లేకండా మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికుకులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని తెలిపింది. కాగా, ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు రీల్స్ మెట్రో రైళ్లలో, ప్రాంగణంలో రీల్స్ చేసిన 1,600 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులు అనేవి గత ముందు సంవత్సరంతో పొలిస్తే ఈసారి మూడు శాతం పెరిగిందని డీఎంఆర్సీ సీనియర్ అధికారులు గురువారం తెలిపారు.

పైగా ఆ కేసుల్లో ఎక్కువగా రైలులో తినడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే.. మెట్రో రైల్వేస్ చట్టంలో సెక్షన్ 59 ప్రకారం.. రీల్స్ చేస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడిన  1,647 మందిపై కేసులు నమొదు చేసినట్టు  ప్రకటించింది. అయితే గతేడాది ఇదే సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన కేసుల సంఖ్య  1600 పెరిగింది. అదే  ఈ ఏడాది చూసుకుంటే.. ఏప్రిల్ నెలలో 610 మంది, మే నెలలో 518, జూన్ నెలలో 519 మందిపై కేసులు నమోదై జరిమానాలు విధించినట్టు తెలిపింది. కనుక మెట్రో ప్రాంగణాల్లో రీల్స్ పేరిట ఇతరులకు ఇబ్బందుకు గురి చేసిన, రైళ్లలో తినడం, కింద కూర్చొవడం వంటివి చేసిన   మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘూ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరీ, డీల్లీ మెట్రో సోషల్ మీడియా యూజర్స్ కు షాక్ ను ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments