iDreamPost
android-app
ios-app

బ్యాచ్‌లర్స్ కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కోసం 3 నెలలు ఆగాల్సిందే!

  • Published Apr 27, 2024 | 4:44 PM Updated Updated Apr 27, 2024 | 4:44 PM

ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుని  కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే.. కొందరు మాత్రం ఇంకా తమ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎదురు చూస్తున్న బ్యాచిలర్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుని  కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే.. కొందరు మాత్రం ఇంకా తమ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎదురు చూస్తున్న బ్యాచిలర్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

  • Published Apr 27, 2024 | 4:44 PMUpdated Apr 27, 2024 | 4:44 PM
బ్యాచ్‌లర్స్ కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కోసం 3 నెలలు ఆగాల్సిందే!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను జరుపుకునేందుకు యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తమ పెళ్లిని కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు. అలానే ప్రతి ఏటా పెళ్లి మూహుర్తల సమయంలో ఎన్నో జంటలు కలుస్తుంటాయి. అలానే ఈ ఏడాది కూడా చాలా జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. అయితే కొందరు మాత్రం ఇంకా పెళ్లి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలా పెళ్లి కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బ్యాచ్ లర్స కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటి, వారికే బ్యాడ్ న్యూస్ ఎందుకు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుని  కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే.. కొందరు మాత్రం ఇంకా తమ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే లేట్ అయ్యిందని, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహం చేసుకోవాలంటే.. ఇదే సమయంలో వారికి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. మరో మూడు నెలల వరకు పెళ్లిళ్లకు అవకాశం లేదని పురోహితులు చెబుతున్నారు. తిరిగి ఆగష్టు 8 తరువాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం వచ్చింది.

సింగిల్ జీవితానికి బై బై చెప్పే రోజులు పోవాలంటే ఆగష్టు 8 వరకు  ఆగాలని, ఆ తరువాత నుంచి కొత్త సంసారంలోకి అడుగు పెట్టేందుకు ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు మూఢం ప్రవేసించింది. మూఢం అంటే గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని జ్యోతిష్యులు చెబుతారు. సాధారణంగా పుష్యమాసంలో తప్ప మిగతా కార్తీకం, మాఘం, చైత్రమాసాలలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు మంచిదని పురోహితులు చెబుతుంటారు.అలా ఈ నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా  కొన్ని వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు తెలిపారు.  ఏప్రిల్ 27, శనివారం నుంచి ప్రారంభమయ్యే మూఢం ఆగస్టు 8 వరకు కొనసాగనుంది.

ఈ 3 నెల్లలో  వివిధ శుభకార్యాల జోలికి వెళ్లరు. వివాహం చేసుకాలని అనుకునే వారు మళ్లీ ఆగస్టు 8వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక ఈ మూడు నెలల పాటు కల్యాణ మండపాలు మూసి ఉంటాయి. అలానే పెళ్లిళ్లపై ఆధారపడే బ్యాండు, వాయిద్య కళకారులు, వెడ్డింగ్ డిజైనర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందే. టెంట్ హౌస్ నిర్వహకులు, పూల అమ్మకందారులు, క్యాటరింగ్ నిర్వాహకులు తదితరులు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిందే  అన్నట్లు తెలుస్తోంది. ఇలా మూఢం రావడం అనేది ఏటా జరిగేది. అలానే ఈ ఏడాది కూడా మూఢం రావడంతో పెళ్లిళకు బ్రేక్ లు పడ్డాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio