iDreamPost
android-app
ios-app

Anchor Gayatri Bhargavi: నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం.. ఝాన్సీ ఎమోషనల్

  • Published Dec 27, 2023 | 10:50 AMUpdated Dec 27, 2023 | 10:50 AM

టాలీవుడ్ యాంకర్, నటి గాయంత్రీ భార్గవి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఝాన్సీ భావోద్వేగానికి గురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

టాలీవుడ్ యాంకర్, నటి గాయంత్రీ భార్గవి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఝాన్సీ భావోద్వేగానికి గురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Dec 27, 2023 | 10:50 AMUpdated Dec 27, 2023 | 10:50 AM
Anchor  Gayatri Bhargavi: నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో విషాదం.. ఝాన్సీ ఎమోషనల్

టాలీవుడ్ బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది గాయత్రీ భార్గవి. సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది గాయత్రీ భార్గవి.  ఆమెకు ప్రముఖ దర్శకుడు బాపుతో ప్రత్యేక అనుబంధం ఉంది. గాయత్రీ భార్గవి బాపు గారి మనవరాలు. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. అయితే బాపు గారి పేరు వాడుకుని.. తాను పైకి రావాలని అనుకోలేదని గతంలో ఓసారి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బిజీగా ఉన్నారు గాయత్రీ భార్గవి. తాజాగా ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. సూర్య నారాయణ శర్మ చనిపోయినట్లు.. యాంకర్ ఝాన్సీ తన ఇన్ స్టాలో పేర్కొన్నారు. “గాయత్రీ భార్గవి తండ్రి మరణించారు.. ఆ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది.. ఈ విషాదాన్ని తట్టుకునేలా.. భగవంతుడు ఆ కుటుంబానికి శక్తినివ్వాలి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను” అంటూ ఝాన్సీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

tragedy in gayathri bargavi house

దీంతో పాటు మరో పోస్ట్ లో ఈ ఏడాదిలో ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. డాడీ, బడ్డీ, శ్రీను ఇలా ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఝాన్సీ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. విషయం తెలిసిన అభిమానులు గాయత్రీకి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఓసారి భార్గవి మాట్లాడుతూ.. బాపు గారితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. “ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికి తెలియదు. నేను కూడా బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు. అందుకే ఆయనతో నాకున్న అనుబంధం గురించి ఎక్కడా  చెప్పలేదు. బాపు పేరు వాడుకొని ఎదగాలని కోరుకోవడం మూర్ఖత్వంగా భావించాను. స్వయంకృషితో ఎదిగితే వచ్చే ఆనందం మరిక దేంట్లోను రాదని నేను నమ్ముతాను. అందుకే బాపు పేరు వాడుకోలేదు” అని చెప్పుకొచ్చింది.  చిన్న వయసులో పెళ్లి చేసుకుంది భార్గవి. ఆ తర్వాత భర్త అంగీకారం, ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. యాంకర్ గా, నటిగా కెరీర్లో ముందుకు సాగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by @anchor_jhansi

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి