iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారులు ఇప్పుడు పెద్ద స్టార్లు!

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరూ చైల్డ్‌ ఆర్టిస్టులుగా జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా మారి హిట్టు సినిమాలు చేస్తున్నారు...

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరూ చైల్డ్‌ ఆర్టిస్టులుగా జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా మారి హిట్టు సినిమాలు చేస్తున్నారు...

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారులు ఇప్పుడు పెద్ద స్టార్లు!

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్లుగా మారిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ ఉన్నారు. ఇద్దరూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా తమ కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగులో స్టార్‌ హీరోల సరసన కలిసి నటించారు. తర్వాత హీరో, హీరోయిన్లుగా మారారు. ఆ ఫొటోలోని పిల్లాడు ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఆ పాప తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నారు. నటనతో అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు.

ఆ ఫొటోలో కనిపిస్తున్న దానికి ప్రస్తుతం వారు ఉన్న దానికి పోలికల్లో పెద్దగా తేడా లేదు. ఆ ఫొటోల్ని బాగా పరికించి చూస్తే ఆ పాప, బాబు ఎవరో ఇట్టే అర్థం అయిపోతుంది. అవును మీరు గెస్‌ చేసింది కరెక్టే.. ఆ ఫొటోలో ఉన్నది యంగ్‌ హీరో తేజ సజ్జా.. హీరోయిన్‌ శ్రీ దివ్య ఇద్దరూ స్టార్‌ హీరోల సినిమాలతోనే సినీ జీవితాన్ని ప్రారంభించారు. తేజ సజ్జా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పదికి పైగా సినిమాల్లో నటించగా.. శ్రీ దివ్య ఓ నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. తర్వాత హీరోయిన్‌ అయింది.

తేజ సజ్జా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి కొడుకుగా నటించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. మహేష్‌ బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, జగపతి బాబు, శ్రీకాంత్‌, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతో సినిమాలు చేశారు. 2021లో వచ్చిన‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ఇష్క్‌, అద్భుతం సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా సినిమా ‘హానుమాన్‌’ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఇక, శ్రీ దివ్య ‘హనుమాన్‌ జంక్షన్‌’సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చారు. దాదాపు ఓ నాలుగు సినిమాలు చేశారు. తర్వాత 2010లో వచ్చిన ‘మనసారా’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశారు. మాతృభాష తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు.. గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యలో కొన్ని తెలుగు సీరియళ్లలో కూడా  శ్రీ దివ్య నటించారు. ఆమె నటించిన తాజా చిత్ర ‘రైడ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక, శ్రీ దివ్య పెళ్లిపై ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler