iDreamPost
android-app
ios-app

Malvi Malhotra: నటి మాల్వి మల్హోత్రాపై హత్యాయత్నం.. 3 కత్తిపోట్లు.. ఏం జరిగిందంటే

  • Published Jul 17, 2024 | 10:12 AMUpdated Jul 17, 2024 | 10:12 AM

Knife Attack-Malvi Malhotra: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మాల్వి మల్హోత్రాకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

Knife Attack-Malvi Malhotra: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మాల్వి మల్హోత్రాకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 17, 2024 | 10:12 AMUpdated Jul 17, 2024 | 10:12 AM
Malvi Malhotra: నటి మాల్వి మల్హోత్రాపై హత్యాయత్నం.. 3 కత్తిపోట్లు.. ఏం జరిగిందంటే

హీరో రాజ్ తరుణ్ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ హీరో మాజీ ప్రేయసి లావణ్య రాజ్‌ తరుణ్‌ మీద సంచలన ఆరోపణలు చేయడమే కాక.. అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గత 11 ఏళ్లుగా రాజ్‌తో రిలేషన్‌లో ఉన్నానని.. గుడిలో పెళ్లి చేసుకున్నామని.. రాజ్‌ తనకు అబార్షన్‌ కూడా చేపించాడని.. అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులు, ఫొటోలను పోలీసులకు అప్పగించింది. రాజ్‌ తనకు కావాలని కన్నీరు పెట్టుకుంది. అంతేకాక నటి మాల్వి మల్హోత్రాతో పరిచయం తర్వాతే రాజ్‌ తనను దూరం  పెట్టాడని.. మాల్వి, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. అలానే మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద ఆరోపణలు చేయడమే కాక.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

ఇక లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా నమోదు చేశారు. రాజ్ తరుణ్‌కి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా..  మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియో రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. మాల్వి తనన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసింది అని ఆరోపించింది. ఇక తాజాగా ఈ అంశంలో మరో కీలక విషయంలో వెలుగులోకి వచ్చింది. మాల్వి మల్హోత్రా మీద కత్తితో అటాక్‌ చేశారని.. మూడు సార్లు కత్తితో పొడిచారని.. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారని వెలుగులోకి వచ్చింది.

ఇక తాజాగా యోగేష్‌ తల్లి.. మాల్వి మల్హోత్రా మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాల్వికి, తన కొడుకు యోగేష్‌కు సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరూ ఒక కేఫ్‌ హౌస్‌లో కలిశారని.. ఆ పరిచయం అలా పెరిగి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది. ఇద్దరూ కొన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నారని.. ఆ తర్వాత ఇద్దరికి గొడవలు రావడంతో.. విడిపోయారని యోగేష్‌ తల్లి చెప్పుకొచ్చింది. ఇలా ఉండగా.. ఈ వివాదం నేపథ్యంలో యోగేష్‌.. మాల్వి మీద కత్తితో దాడి చేశాడని తెలిసింది.

ఇక మాల్విపై దాడి జరిగింది ఇప్పుడు కాదు.. సుమారు 4 సంవత్సరాల క్రితం అనగా.. 2020 అక్టోబర్‌లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసింది ఎవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్‌.. మాల్విపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె అంగీకరించలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్‌.. మాల్విని కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఇక మర్డర్ అటెంప్ట్ కేసులో యోగేష్‌ అరెస్ట్ అవగా ఇప్పుడు.. అతడి తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్‌ని ట్రాప్ చేసి, ఆస్తులు కాజేసి జైలుపాలు చేసిందని ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. మాల్వి మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి