iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే..?

Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మహేష్ బాబు ఫ్లట్ చేసే ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఎవరో తెలుసా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మహేష్ బాబు ఫ్లట్ చేసే ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఎవరో తెలుసా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే..?

విక్టరీ వెంకటేశ్- మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీ 2013లో సంక్రాంతి బరిలో నిలిచి ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. పచ్చని పల్లెటూరు, బంధాలు, అనుబంధాలు, అన్నాదమ్ముల రిలేషన్ షిప్స్, మంచి, మానవత్వం, మర్యాద అంటూ ఫక్తు ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించడంతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికీ ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వెంకటేశ్ నటన, మహేష్ చరిష్మా, సీతగా అంజలి, సిటీ అమ్మాయిగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ వంటి స్టార్స్ నటించారు. ఇక ఇందులో మరికొంత మంది బ్యూటీలు కూడా చిన్న చితకా పాత్రల్లో మెరిశారు. వారిలో ఒకరు ఈ అమ్మడు కూడా.

ఈ సినిమాలో మహేష్ హైదరాబాద్ నుండి రైలులో ఇంటికి వస్తాడు. తనతో పాటు జర్నీ చేసిన అమ్మాయిని ఫ్లట్ చేస్తాడు. ‘మీరు సెల్ ఫోన్ మర్చిపోయారు’ అంటూ ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని రాగానే.. ‘కావాలనే మర్చిపోయాను’ అంటూ ఆమెతో మాటలు కలిపేస్తాడు. ‘ఇప్పటి వరకు దీని లెఫ్ట్ ప్రొఫైలే చూశాం.. రైడ్ కూడా చూసేద్దాం’ అంటూ ఆమె చుట్టూ తిరిగేస్తాడు. అంతలో అన్న వెంకటేశ్ కనబడగానే.. ఆమెకు దారి చూపిస్తున్నట్లు నటిస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందులో మహేష్ తన మాటలతో బుట్టలో వేసుకున్న ఆ అమ్మాయి ఎవరంటే.. సుప్రియ ఐసోల. ఆమె అనేక సినిమాల్లో నటించింది. అవసరాల శ్రీనివాస్ బాబు బాగా బిజీ చిత్రంలో కూడా నటించింది ఈ బ్యూటీ. అందులో కాస్తతం బోల్ట్ క్యారెక్టర్ చేసింది.

SVSC

ఆమె కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్, జర్నలిస్ట్ అని తెలుస్తుంది.  సుప్రియ థియేటర్ ఆర్టిస్టు కూడా. ఆమె చాలా సినిమాల్లో నటించింది. సశేషం అనే మూవీలో హీరోయిన్ రోల్ చేసింది ఈ బ్యూటీ. 2012లో వచ్చిన ఆర్టిఫిషియల్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ఐసోల.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భూ అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది. కానీ ఆమెకు అంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఇటీవలే రానానాయుడు సిరీస్‌లో కీలకపాత్ర పోషించింది. ఆశిష్ విద్యార్థి భార్య పద్మా నాయుడు పాత్రలో మెరిసింది ఈ బ్యూటీ. ఇక అక్కడ నుండి కొత్త సినిమాలు చేస్తున్న అప్ డేట్స్ లేవు. ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. దీనితో పాటు రానా నాయుడు 2 ఉన్న నేపథ్యంలో ఇందులో కూడా కనబడే ఛాన్సులు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Supriya Aysola Fans (@supriya_aysola_1)