iDreamPost
android-app
ios-app

నమ్మకంపై సమంత పోస్టు.. ఇప్పుడెందుకు?

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాదు! నగలు, దుస్తులు ఇతర బ్రాండ్‌ల యాడ్స్‌లో నటిస్తూ..

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాదు! నగలు, దుస్తులు ఇతర బ్రాండ్‌ల యాడ్స్‌లో నటిస్తూ..

నమ్మకంపై సమంత పోస్టు.. ఇప్పుడెందుకు?

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత మైయోసైటిస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి కొన్ని కఠిన నిమయాలు, ఆరోగ్య సూత్రాలను, థెరపీలను ఆమె ఫాలో అవుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు. సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. అభిమానులకోసం సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు.

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాదు! నగలు, దుస్తులు ఇతర బ్రాండ్‌ల యాడ్స్‌లో నటిస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలోనే షేర్‌ చేస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. సమంత తాజాగా నమ్మకంపై ఓ పోస్టు పెట్టారు. ఆదివారం తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ స్టోరీలో నమ్మకంపై ‘‘నిన్ను నువ్వు బలంగా నమ్ముకో.. అప్పుడు ఈ లోకం నువ్వు కోరుకున్నదాన్ని నీకు ఇచ్చి తీరుతుంది’’ అని పోస్ట్‌ పెట్టారు.

ఆ పోస్టు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత ఈ సమయంలో ఆ పోస్టు ఎందుకు పెట్టిందా అని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆలోచిస్తున్నారు. కాగా, సమంత చివరగా ఖుషీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. విజయ్‌ దేవరకొండ సరసన సామ్‌ నటించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె చెన్నై స్టోరీస్‌ అనే తమిళ్‌, ఇంగ్లీష్‌ బైలింగువల్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇది సమంత మొదటి హాలీవుడ్‌ సినిమా కావటం విశేషం.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/