iDreamPost
android-app
ios-app

Raj Tarun: రాజ్ తరుణ్‌పై కేసు నమోదు! అబార్షన్ రిపోర్ట్స్, 170 ఫొటోలతో లావణ్య పోలీస్ స్టేషన్‌కి!

  • Published Jul 10, 2024 | 1:36 PMUpdated Jul 10, 2024 | 1:36 PM

Raj Tarun Issue-Lavanya Get Abortion: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో రోజుకో ట్విస్ట్‌ తెర మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి మాజీ ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు..

Raj Tarun Issue-Lavanya Get Abortion: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో రోజుకో ట్విస్ట్‌ తెర మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి మాజీ ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు..

  • Published Jul 10, 2024 | 1:36 PMUpdated Jul 10, 2024 | 1:36 PM
Raj Tarun: రాజ్ తరుణ్‌పై కేసు నమోదు! అబార్షన్ రిపోర్ట్స్, 170 ఫొటోలతో లావణ్య పోలీస్ స్టేషన్‌కి!

రాజ్‌ తరుణ్‌, అతడి మాజీ ప్రియురాలు లావణ్య వివాదం పూటకో మలుపు తిరుగుతుంది. ఇక ఈ గొడవలోకి హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి చేరింది. ఇక తాజాగా లావణ్య, మాల్వి ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య మరోసారి సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది. రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ చేయించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘నేను అన్విక అనే పేరుతో రాజ్‌ తరుణ్‌తో కలిసి ఉన్నాను. అదే పేరుతో విదేశాలకు వెళ్లాం. కొన్నాళ్ల క్రితం రాజ్‌ తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు. ఇందుకు సంబంధించిన మెడికల్‌ డాక్యుమెంట్లతో పాటు 170 ఫొటోలను కూడా పోలీసులకు అందించాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పోలీసులు నేడు అనగా బుధవారం నాడు హీరో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు.

రాజ్‌ తరుణ్‌తో తనది 11 ఏళ్ల బంధమని.. కానీ మాల్వి వచ్చాకే.. తమ ఇద్దరి మధ్య దూరం వచ్చిందని లావణ్య ఆరోపించింది. మాల్వితో పరిచయం ఏర్పడ్డాకే.. రాజ్‌ తరుణ్‌ తనను దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది లావణ్య. ఈ క్రమంలో మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇదిలా ఉండగా.. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లావణ్య తమను బెదిరిస్తుందని.. పోలీసులకు చెప్పుకొచ్చింది మాల్వి.

ఇక రాజ్‌ తరుణ్‌తో తనకు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించే సమయం నుంచే పరిచయం ఉందని.. గత 11 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నామని లావణ్య చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాత.. రాజ్‌ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. తనను వదిలించుకోవడం కోసమే డ్రగ్స్‌ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చింది. జైలులో ఉన్న తనను కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మాల్వి, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని.. రాజ్‌ తరుణ్‌ని వదిలేయమని వార్నింగ్‌ ఇస్తున్నారు అని ఆరోపణలు చేసింది.

అయితే ఈ వివాదంపై రాజ్‌ తరుణ్‌ భిన్నమైన వాదనలు వినిపించాడు. తనకు లావణ్యతో పరిచయం ఉన్న మాట వాస్తవమే అని.. కానీ ఆమెకు డ్రగ్స్‌ అలవాటు ఉండటమే కాక.. మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాజాగా లావణ్య చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఇక ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అలానే లావణ్య చేసిన తాజా ఆరోపణలపై రాజ్‌ తరుణ్‌ ఎలా స్పందిస్తాడో అని ఆత్రుతతగా ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి