iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్! ఎలా ఉందో చూడండి!

ప్రభాస్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్లతో నటించిన బ్యూటీ గుర్తుందా.. పూజ, దీపాలి క్యారెక్టర్లతో ఆకట్టుకుంది. తెలుగు కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ప్రభాస్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్లతో నటించిన బ్యూటీ గుర్తుందా.. పూజ, దీపాలి క్యారెక్టర్లతో ఆకట్టుకుంది. తెలుగు కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్! ఎలా ఉందో చూడండి!

కొంత మంది భామలు అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. చేసినవీ కొన్ని సినిమాలే అయినా..మనసుపై చెరగని ముద్రవేస్తుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధాలు లేకుండా ఆకట్టుకుంటారు. తొలి సినిమాతో క్లిక్ అయ్యి.. ఫేమ్ తెచ్చుకుంటారు. కానీ వీరికి ఎక్కడో బ్యాడ్ లక్ నడుస్తూ ఉంటుంది. రిలీజైనా సినిమాలన్నీ ప్లాప్ అవుతుంటాయి. ఆఫర్లు తగ్గిపోతుంటాయి. ఇక ఈ సినిమా రంగం మనకు సెట్ కాదని భావించి.. ఇండస్ట్రీ నుండి పూర్తిగా వైదొలుగుతుంటారు. అలా తెలుగు కుర్రకారును తన నవ్వుతో, గ్లామరస్ షోతో కట్టిపడేసిన బ్యూటీ దీక్షా సేథ్. ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ అగ్ర హీరోల సరసన యాక్ట్ చేసింది. అనూహ్యంగా ఆరేళ్లకే కెరీర్ ముగించేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఎంతలా మారిపోయిందో తెలుసా.?

వర్సటైల్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుండి వచ్చిన ఎక్స్‌పర్ మెంటల్ మూవీ వేదం. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కీలక పాత్రలు పోషించారు. ఇందులో అల్లు అర్జున్ కేబుల్ రాజు పాత్రలో మెరిసిపోతాడు. ఇందులో ఓ పార్స్ అండ్ రిచ్ గర్ల్ లవ్ చేస్తాడు. ఆమె కోసం పడరాని పాట్లు పడతాడు. ఆ హీరోయిన్నే దీక్షాసేథ్. ఇందులో ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ప్రభాస్, రవితేజ, గోపీచంద్, మంచు మనోజ్, దర్శన్ వంటి పాన్ ఇండియన్, సౌత్ ఇండియన్ స్టార్స్ సరసన యాక్ట్ చేసింది. ఉబ్బిన పెదాలతో, గోలిక్కాయ లాంటి గుండ్రని కళ్లతో.. మంచి ముఖ వర్చస్సుతో ఆకట్టుకుంది దీక్షాసేథ్. ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తుంది.

డిల్లీ నుండి వచ్చిన ముద్దుగుమ్మల్లో దీక్షా ఒకటి. తండ్రి ఐటీసీ ఉద్యోగి కావడంతో తరచూ ట్రాన్స్ ఫర్స్ అవుతుండేవి. అలా ఆమె చిన్నప్పుడే ముంబయి, చెన్నై, కోల్ కతా, రాజస్థాన్, గుజరాత్, యుపి, నేపాల్ ప్రాంతాలను చుట్టేసింది. చెన్నైలో నర్సరీ నుండి మూడవ తరగతి వరకు చదువుకుంది. ఆమె మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. తర్వాత మోడలింగ్ చేసింది. ఆ సమయంలోనే క్రిష్ కళ్లలో పడి వేదం మూవీలో ఆఫర్ కొట్టేసింది. ఇందులో పూజ పాత్రలో ఆకట్టుకుంది. 70 మంది అమ్మాయిలను కాదని ఈమెను తీసుకున్నారట. రవితేజతో మిరపకాయ్, నిప్పు గోపిచంద్ వాంటెడ్, మనోజ్ ఊ కొడతారా? ఉలిక్కి పడతారా, ప్రభాస్‌తో రెబల్ చిత్రాల్లో నటించింది.

ఇందులో దీపాలి క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేసింది. డార్లింగ్‌కు మంచి పెయిర్ అనిపించుకుంది. అయితే తెలుగులో ఇదే ఆమెకు చివరి సినిమాగా నిలిచిపోయింది. అటు నుండి హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. దర్శన్ తో జగ్గుదాదాలో యాక్ట్ చేసింది. హిందీ మూవీ సాద్ కదమ్ తర్వాత ఆమె కనిపించలేదు. పెళ్లి చేసుకుని యుకేలో సెటిల్ అయినట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరింత గ్లామరస్ ఫోజులతో సెగలు పుట్టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Deeksha Seth (@deeksha721)

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş