iDreamPost
android-app
ios-app

Pic Talk: నేనింతే మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే దిమ్మతిరిగిపోతుంది..

  • Published Jul 14, 2024 | 3:59 PMUpdated Jul 14, 2024 | 4:49 PM

సోషల్ మీడియాలో ప్రస్తుతం పిక్ టాక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం పిక్ టాక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jul 14, 2024 | 3:59 PMUpdated Jul 14, 2024 | 4:49 PM
Pic Talk: నేనింతే మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే  దిమ్మతిరిగిపోతుంది..

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ హీరోలు , హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటితో పాటు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన నటి నటులు ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు అని వారికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటి గురించి ఇప్పడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సిందల్లా.. ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ గురించి. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాలు తగ్గిపోడంతో. ఈమె కోసం తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ హీరోయిన్ ఎవరు.. ఇప్పుడు ఎం చేస్తుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ హీరోయిన్ మరెవరో కాదు.. మాస్ మహారాజ రవి తేజ హీరోగా.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2008 లో రిలీజ్ అయినా.. నేనింతే సినిమా గుర్తుందా.. ఈ సినిమా ఇప్పటికి కూడా ఎంతో మంది మూవీ లవర్స్ కు చాల స్పెషల్ మూవీ. ఓ విధంగా అందరికి ఇది ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పి తీరాల్సిందే. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ , సాంగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ.. ఆ సమయంలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటె.. ఈ సినిమాలో రవి తేజకు జోడిగా నటించిన హీరోయిన్.. శియా గౌతమ్. ఈ సినిమాతోనే శియా గౌతమ్ తెలుగు తెరకు పరిచయం అయ్యి.. తెలుగు వారి మదిలో స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. శియా గౌతమ్ అసలు పేరు “అదితి గౌతమ్”. సినిమాలలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మడు శియా గౌతమ్ గా పేరు మార్చుకుంది.

శియా గౌతమ్ నటనపై ఉన్న ఆసక్తితో మొదట మోడల్ గా రాణించింది. ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నేనింతే సినిమా తర్వాత.. ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అందం అభినయం అన్ని ఉన్న కానీ.. ఆశించిన స్థాయిలో ఈ అమ్మడు సినిమా రంగంలో రాణించలేకపోయింది. అటు బాలీవుడ్ లోను రణబీర్ కపూర్ కు జోడిగా.. సంజూ చిత్రంలో నటించింది ఈ అమ్మడు. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాకపోడంతో.. అటు బాలీవుడ్ లోను ఎటువంటి గుర్తింపు సంపాదించలేకపోయింది. ఇక ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉన్నా కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్ తో అందరిని ఆశ్చర్య పరుస్తుంది. మరి శియా గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Gautam | Siya gautam | Actor (@aditigautamofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి