iDreamPost

Suhas: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండుకు వచ్చిన స్పందన పై సంతోషం వ్యక్తం చేసిన హీరో సుహాస్

  • Published Feb 03, 2024 | 2:18 PMUpdated Feb 03, 2024 | 2:18 PM

నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్య ప్రదీప్, శివానీ నాగరం కీలక పాత్రలు పోషించారు. కాగా ఇటీవలే నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్య ప్రదీప్, శివానీ నాగరం కీలక పాత్రలు పోషించారు. కాగా ఇటీవలే నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Published Feb 03, 2024 | 2:18 PMUpdated Feb 03, 2024 | 2:18 PM
Suhas: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండుకు వచ్చిన స్పందన పై సంతోషం వ్యక్తం చేసిన హీరో సుహాస్

యువ నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు నిన్న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్య ప్రదీప్, శివానీ నాగరం కీలక పాత్రలు పోషించారు. కాగా ఇటీవలే నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ -”నిన్న శ్రీ రాములు థియేటర్ లో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ‘ చూశాను, రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలయ్యాను. నాకు మరో హిట్ సినిమా ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. సినిమా చూసేందుకు థియేటర్లకు రావడం ఆనందంగా ఉంది. మీడియా మిత్రులు మా సినిమాకు మంచి రివ్యూలు రాశారు. వారందరికీ ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “అనవసరమైన యాక్షన్, ఇతర ఎలిమెంట్స్ లేకుండా చెప్పిన ప్యూర్ స్టోరీ ఇది. ఈ మధ్య కాలంలో అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ మీద ఫోకస్ చేసిన సినిమా రాలేదు. ”సోదరి పాత్రలో శరణ్య అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ లో సుహాస్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు ‘ఈ కుర్రాడు ఎంత సహజంగా నటించగలడు?’ అని ఆశ్చర్యపోయాను. మనకున్న అతికొద్ది మంది నేచురల్ యాక్టర్స్ లో సుహాస్ ఒకరు.

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ -”ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ వరకు మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్ . పద్మ పాత్రను నేను బాగా చేయగలనని మా దర్శకుడు దుష్యంత్ నమ్మారు. ఈ రోజు థియేటర్లలో అది నిజమని రుజువు అయినందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి