హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట!

హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట!

టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. అతడిపై ఏకంగా పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి భారీ ఊరట లభించింది.

టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. అతడిపై ఏకంగా పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కి భారీ ఊరట లభించింది.

గత కొన్నిరోజులగా టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనని మోసం చేసి.. వేరే హీరోయిన్ తో  ప్రేమాయణం సాగిస్తున్నాడన్న లావణ్య ఆరోపణలు చేసింది. అంతేకాక  నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ హీరోయిన్, ఆమె సోదరుడిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా లావణ్య వివాదంలో రాజ్ తరుణ్ కి రిలీఫ్ వచ్చింది. మరి.. ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి హైకోర్టులో ఊరట లభించింది. అతడు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని రోజుల క్రితం లావణ్య..రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైట్ ఇచ్చింది. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య పెళ్లి చేసుకున్నామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే హీరోయిన్ తో లవ్ లో ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక తనపై నమోదైన కేసు విషయంలో రాజ్‌ తరుణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Show comments