పునీత్ రాజ్ కుమార్ భార్యని అవమానిస్తూ దారుణమైన పోస్ట్! FIR నమోదు!

పునీత్ రాజ్ కుమార్ ను అవమానిస్తూ పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

పునీత్ రాజ్ కుమార్ ను అవమానిస్తూ పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

పునీత్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్. కానీ ప్రాంతాలకు అతీతంగా గుర్తింపు, క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈయన కుటుంబంలోని వారంతా సినిమాల్లోనే ఉన్నారు. సోదరుడు శివరాజ్ కుమార్ కూడా స్టార్ హీరోనే. ఇక కన్నడలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే కన్నమూశాడు. గుండెపోటుతో మరణించాడు. ఆయనను కడసారి చూడటం కోసం లక్షలాది మంది అభిమానులు స్వయంగా తరలి వచ్చారంటే.. ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ భార్యపై అవమానకర పోస్ట్ చేశాడు. దాంతో అభిమానులు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు..

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆర్సీబీ ఓటమికి దివంగత నటుడు పునీత్ రాజ్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమారే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అశ్విని పునీత్ రాజ్ కుమార్ ఆర్సీబీ కార్యక్రమానికి రావడం వల్లే ఆ జట్టు ఓడిపోయిందంటూ అవమానకరీతిలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో.. ఇటు పునీత్ అభిమానులు, అటు ఆర్సీబీ అభిమానులు సదరు వ్యక్తిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీని ఆధారంగా దుండుగుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్‌లోమాత్రమే విజయం సాధించగా.. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఇక శనివారం నాడు ఆర్సీబీ, రాయజస్తాన్ రాయల్ చాలెంజర్స్ తో తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ నేటి మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధించి తీరాలి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మరి నేడు ఆర్సీబీ విజయం సాధిస్తుందో.. లేదో తెలియాంటే కొన్ని గంటలు ఎదురు చూడాలి.

Show comments