Dhamini,rathika subhashree re entry to big boss: దామిని, రతిక, శుభశ్రీ రీ ఎంట్రీ! బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్!

దామిని, రతిక, శుభశ్రీ రీ ఎంట్రీ! బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్!

బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగిపోతోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ విభిన్నమైన టాస్కులు పెడుతూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ పంచడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. బిగ్ బాస్ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో పాల్గొనడంతో ఈ షోపై క్యూరియాసిటి విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన ధామిని, రతికా రోజ్, శుభశ్రీ బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ షో ప్రారంభంలోనే ఉల్టా పుల్టా అంటూ హోస్ట్ నాగార్జున చేసిన ప్రకటన దానికి తగ్గట్లుగానే షో సాగిపోతోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు ఎవరికి వారు ఓ స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ చివరి వరకు ఉండి విజయం సాధించాలనే కసితో ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో నుంచి స్వయంకృత అపరాధం వల్లనో లేదా ఓటింగ్ తగ్గడం మూలంగనో రతికా రోజ్, ధామిని, శుభ శ్రీ లు బిగ్ బాస్ షో నుంచి నిష్క్రమించారు. అయితే మళ్లీ ఈ ముగ్గురు బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఓటింగ్ ఇవ్వడం ద్వారా వారు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్లు ఎవరినైతే ఎంచుకుంటారో వారు మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. వీరి ముగ్గురికి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ ఆడియెన్స్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.

Show comments