Devara Movie: దేవర మూవీలో ‘చుట్టమల్లే’ పాట పాడిన తెలుగుమ్మాయి శిల్పారావు ఎవరంటే?

దేవర మూవీలో ‘చుట్టమల్లే’ పాట పాడిన తెలుగుమ్మాయి శిల్పారావు ఎవరంటే?

Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాట ప్రస్తుతం చార్ట్ బాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పాట పాడిన సింగర్ శిల్పారావు గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాట ప్రస్తుతం చార్ట్ బాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ పాట పాడిన సింగర్ శిల్పారావు గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా  దేవర. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇది ఇలా ఉంటే.. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా వదలకుండా వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆగష్టు 5వ తేదీన దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ లిరిక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసింది. ఈ పాట ఛార్ట్ బస్టర్ కావడంతో .. ఆ పాట పాడిన సింగర్ శిల్పరావు గురించి సినీ ప్రియులు తెగ  సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో ఇప్పుడు  తెలుసుకుందాం…

తారక్, జాన్వీ కపూర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డ్యూయెట్ సాంగ్ వచ్చేసేంది. ఆగష్టు 5 సోమవారం దేవర పార్ట్ 1 నుంచి  ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తంటరి’ అనే సాంగ్ వచ్చేసింది.  ఇప్పటి వరకు తారక్ ని, జాన్వీ కపూర్ ని మూవీలోను కూడా ఇంత లవ్లీగా చూసుండరు. ఇంక జాన్వీ కపూర్ కూడా గతంలో వచ్చిన పోస్టర్ చూస్తే లంగా ఓణీలో కనిపించింది. కానీ, ఈ సాంగ్ లో మాత్రం దేవకన్యలా ఆకట్టుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే  కొన్ని మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాక ప్రస్తుతం ఛార్ట బస్టర్ లో టాప్ లో నిలుస్తోంది.

చుట్టమల్లే పాటలో జాన్వీ కపూర్ అందాల ఆరోబోత ఒక ఎత్తు అయితే ఇక ఈ అందమైన పాటను పాడి మనందర్ని అలరించిన గాయని శిల్పారావు మరొక ఎత్తు. ఇదే సమయంలో ఈ పాట ఫుల్ వైరల్ కావడంతో సింగర్ శిల్పారావు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సింగర్ శిల్పారావు అచ్చమైన మన తెలుగుమ్మాయి కావడం విశేషం. తన తండ్రి వెంకట్రావు ఉద్యోగ రీత్యా జార్ఖాండ్ లోని జంషెడ్ పూర్  వెళ్లి.. అక్కడే సెటిల్ అయ్యారు. తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో దుమ్ముదులిపింది. 2020లో వార్ సినిమాలోని  గుంగూ సాంగ్ తో శిల్ప ఫిలింఫేర్ గెల్చుకున్నారు. పఠాన్ మూవీలో బేషరం రంగ్, జైలర్ లో కావాలయ్యా అనే పాటను పాడింది. ఇప్పుడు టాలీవుడ్ లో సైతం ఆమె తన సత్తా చాటుచుతుంది.

ఇటీవలే గుంటూరు కారం సినిమాలో ఓ మైబేబీ పాటల్ని ఆమే పాడారు. శిల్పరావు బాలీవుడ్ లో 2007 నుంచి తన సంగీతంతో, తన గానంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె 1984లో జన్మించింది.  ఆమె తండ్రి వెంట్రావుకు కూడా సంగీతంపై ఆసక్తి ఉండేది. అందుకే  మ్యూజిక్ లో ఆయన డిగ్రీ చేశారు. తండ్రీ ప్రోత్సాహంతోనే శిల్పారావు సైతం అదే బాటలో సంగీతం నేర్చుకుంది. 2001లో జరిగిన ఓ జాతీయ ప్రతిభ హంట్ సింగింగ్ పోటీల్లో శిల్పారావు విజేత గా నిలిచింది. ఫోటో గ్రాఫర్ రితేశ్ కృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. ఇప్పటికే సౌత్ లో ఆమె పాడిన పలు పాటలు సూపర్ హిట్ గా కాగా.. దేవర లో చుట్టమల్లే  పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి..మన తెలుగుమ్మాయి శిల్పారావు విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments