iDreamPost
android-app
ios-app

దర్శన్ మెడకి కొత్త ఉచ్చు! తెరపైకి మేనేజర్ ఆత్మహత్య కేసు!

  • Published Jun 18, 2024 | 6:29 PM Updated Updated Jun 18, 2024 | 6:29 PM

అభిమాని హత్య కేసులో దర్శన్ జైలు పాలు కావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో అతడి దగ్గర పనిచేసిన మేనేజర్ మిస్సింగ్ అయ్యాడు. కాగా ఇప్పుడు మరో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే..

అభిమాని హత్య కేసులో దర్శన్ జైలు పాలు కావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో అతడి దగ్గర పనిచేసిన మేనేజర్ మిస్సింగ్ అయ్యాడు. కాగా ఇప్పుడు మరో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే..

  • Published Jun 18, 2024 | 6:29 PMUpdated Jun 18, 2024 | 6:29 PM
దర్శన్ మెడకి కొత్త ఉచ్చు!  తెరపైకి మేనేజర్ ఆత్మహత్య కేసు!

కన్నడ ఇండస్ట్రీని కుదిపేసిన అంశం దర్శన్ అరెస్ట్. ప్రియురాలి గురించి రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేయించిన ఘటనలో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు ఈ స్టార్ నటుడు. ఈ కేసులో మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పుడు దర్శన్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో మేనేజర్ మల్లిఖార్జున కూడా మిస్సింగ్ అని తేలింది. 2018 నుండి కనిపించకుండా పోయాడు. 2011 నుండి దర్శన్ వద్దే పనిచేశాడు. అతడి బిజినెస్. ఫైనాన్స్ మ్యాటర్.. మేనేజర్ చూసేవాడు. అయితే దర్శన్ కు వెన్నుపోటు పొడిచి.. పలువురి నుండి డబ్బులు తీసుకున్నాడని తెలుస్తుంది. అతడి అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో దర్శన్, మల్లి ఖార్జున్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. అయితే అప్పటి నుండి అతడి జాడ కానరాలేదు.

ఇప్పుడు రేణుకా స్వామి హత్య నేపథ్యంలో.. పాత మేనేజర్ మిస్సింగ్ ఇష్యూ బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. మరో మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు శివార్లలోని నటుడు దర్శన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో గత ఏప్రిల్‌లో మరో మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనేకల్ తాలూకాలోని బగ్గనదొడ్డిలో చోటుచేసుకుంది.  బగ్గనదొడ్డిలోని దుర్గా ఫాంహౌస్‌లో మేనేజర్‌గా పని చేసిన క్రమంలో శ్రీధర్ సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని చూసిన శ్రీధర్ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు.  శ్రీధర్ ఫామ్ హౌస్ పక్కన రక్తపు మడుగుల్లో మృతి చెందినట్టు గుర్తించారు. ఏడాది పాటు మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఫాంహౌస్ సమీపంలో శవమై కనిపించాడు.

దాదాపు 2 ఎకరాల 36 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  మరణానికి ముందు డెత్ నోట్ రాశాడు. అలాగే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన మరణానికి తానే కారణం అని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ఎవ్వరీ ఇబ్బంది పెట్టొద్దు అంటూ  చెప్పుకొచ్చాడు.  అంతేకాకుండా స్వయంగా డెత్ నోట్ రాశాడు.  ఆ సూసైడ్ నోటుపై సంతకం పెట్టి బొటన వేలు ముద్ర కూడా వేశాడు. దీంతో పలు అనుమానాలకు తావునిస్తున్నాయి.  అలాగే వీడియోలో తన చావుకు తానే కారణమంటూ పలుమార్లు చెప్పడం కూడా సందేహాలను కలిగిస్తుంది. రేణుకా స్వామి హత్య కేసు వేళ.. దర్శన్ ఇద్దరు మేనేజర్లలో ఒకరు మిస్సింగ్ కావడం, మరొకరు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş