iDreamPost
android-app
ios-app

జానీ ఆ అమ్మాయికి గోల్డ్, క్యాష్ ఇచ్చాడు.. నా దగ్గర ఫ్రూవ్స్ ఉన్నాయి : ఆయేషా

Jani Master Wife: తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు.. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే ఆయన భార్య ఆయేషా బాధితురాలి వల్లే ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెబుతుంది.

Jani Master Wife: తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు.. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే ఆయన భార్య ఆయేషా బాధితురాలి వల్లే ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెబుతుంది.

జానీ ఆ అమ్మాయికి గోల్డ్, క్యాష్ ఇచ్చాడు.. నా దగ్గర ఫ్రూవ్స్ ఉన్నాయి : ఆయేషా

అత్యాచార ఆరోపణలపై ఇండియన్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ అరెస్టు అయ్యాడు. గోవాలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు.. కేసును పర్యవేక్షిస్తున్న నార్సింగి పోలీసులకు అప్పగించారు.  అనంతరం ఉప్పర పల్లి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఔట్ డోర్ షూటింగ్స్, వ్యానిటీ వ్యాన్, తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. జానీని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేయనున్నారు నార్సింగీ పోలీసులు. ఈ కేసులో అతడిని దాదాపు పదిరోజుల పాటు కస్టడీకి కోరనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా.. తామే అసలైన బాధితులమంటూ గోడు వెలిబుచ్చుతోంది. తమపై ఆ అమ్మాయి రాంగ్ కేసులు పెట్టిందని పేర్కొంది. తనను బాబీ(వదిన) అని పిలిచి.. జానీని బావ అంటూ చేరువైందని, తనను పెళ్లి చేసుకోవాలని జానీని బలవంతం పెట్టిందని, లేకుంటే చచ్చిపోతా అంటూ బెదిరించిందని వాపోయింది. తనను వదిన అని పిలిచే సరికి.. అసలు అనుమానించలేదని, తన దగ్గర డబుల్ గేమ్ ప్లే చేసిందని తెలిపింది. చివరకు తనకు విషయం తెలిసి.. ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి రాంగ్ వేలో వెళుతున్నావ్ ఇది కరెక్ట్ కాదంటూ కూడా మంచిగా చెప్పానంటూ పేర్కొంది. ఈ ఏజ్‌లో ఎట్రాక్షన్ ఉండొచ్చు.. ఆ వయస్సు ప్రభావం అలాంటిది అని తామిద్దరం చెప్పాడంటూ వెల్లడించింది ఆయేషా. అదే సమయంలో జానీ మాస్టర్ నుండి బంగారం తీసుకున్నట్లు తెలిపింది.

జానీ మాస్టర్ నుండి ఆ అమ్మాయి గోల్ట్, క్యాష్ తీసుకుందని, తన వద్ద ఫ్రూవ్స్ ఉన్నాయని చెప్పింది ఆయన భార్య ఆయేషా. ‘ ఆ అమ్మాయికి జానీ మాస్టర్ నుండి గోల్డ్, క్యాష్ తీసుకుంది. నా భర్త ఆమెకు ఏమేమీ ఇచ్చారో ఫ్రూవ్స్ ఉన్నాయి. నాకు ఈ గిఫ్ట్ కొనివ్వు, నాకు అది కొనివ్వు, ఇది ఇవ్వు అంటూ అడిగేది. నా దగ్గర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డబ్బులు తీసుకుంది. ఇదంతా ఆమె అమ్మ నడిపిస్తున్న నాటకం. ఏ అమ్మా పెళ్లైన మగాడి దగ్గరకు పంపుదు కదా. ఇది పక్కా హనీ ట్రాప్. బాధితురాలు అని చెప్పుకుంటున్న ఆమె డబుల్ గేమ్ ప్లే చేసింది. దీని వ్లల నేను ఆత్మహత్యకు యత్నించా. నా బిడ్డలకు దూరం అయ్యా.

ఆ అమ్మాయి ఆడుతున్న గేమ్ నాకు తెలిసి..దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్లి అడిగా.. అప్పుడు కూడా జానీ మాస్టర్‌కు దగ్గరగా జరుగుతుంటే.. నేను ఓర్వలేక.. దూరంగా జరుగూ అంటూ హెచ్చరించా. అప్పుడు కూడా మా మధ్య ఏం లేదు అంది. ఆ ప్రూఫ్ కూడా ఉంది. ఆ అమ్మాయి, వాళ్ల అమ్మ ఇద్దరు సైకోస్. ఇప్పుడు ఎవరైతే ఆమెకు లైఫ్ ఇస్తున్నారో.. వాళ్లు కూడా త్వరలోనే బయటకు వస్తారు. అది ఎంత పెద్ద స్టారైనా కానీ.. రోడ్డు మీదకు వస్తారు’ అంటూ హెచ్చరించింది ఆయేషా..  ఇదిలా ఉంటే ఈ కేసులో జానీ బెయిల్ కోసం ఆయన తరుఫు న్యాయవాది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఎవరిదీ తప్పు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.