iDreamPost
android-app
ios-app

ఎందుకు బ్రతికున్నాను అనిపించింది…పల్లవి ప్రశాంత్ ఎమోషనల్

  • Published Feb 15, 2024 | 3:32 PM Updated Updated Feb 15, 2024 | 3:32 PM

Pallavi Prashanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన టైటిల్ గెలవడంతో వచ్చిన ఫేమ్ కంటే ఆ తరువాత జరిగిన పరిణామాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ షోలో మరోసారి కనిపించి.. తన ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.

Pallavi Prashanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన టైటిల్ గెలవడంతో వచ్చిన ఫేమ్ కంటే ఆ తరువాత జరిగిన పరిణామాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ షోలో మరోసారి కనిపించి.. తన ఇష్యూ గురించి ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.

  • Published Feb 15, 2024 | 3:32 PMUpdated Feb 15, 2024 | 3:32 PM
ఎందుకు బ్రతికున్నాను అనిపించింది…పల్లవి ప్రశాంత్ ఎమోషనల్

బిగ్ బాస్.. ఈ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా  పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే అనేక సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇటీవలే సీజన్ 7ను కూడా పూర్తి చేసుకుంది. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ షో  ఆసక్తికరంగా సాగింది. అలానే గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన  రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలవడం, ఆ తరువాత అతడిని అరెస్టు చేయడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరోసారి ఆ ఇష్యూ గురించి తలుచుకుని పల్లవి ప్రశాంత్ ఎమోషనలయ్యాడు.  తన తండ్రిని ఆస్థితిలో చూసి ఎందుకు బతికున్నాను అనిపించింది అంటూ ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నారు.

ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ పూర్తైన తరువాత బీబీ ఉత్సవ పేరుతో ఆయా సీజన్ల లో పాల్గొన్న కంటెస్టెంట్స్  అంతా కలిసి సెలబ్రెట్ చేసుకుంటారు. అలానే సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా  బీబీ ఉత్సవం పేరుతో ఒకచోట కలిశారు. బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన సంఘటనలు ఒకరికొకరు పంచుకున్నారు.  బిగ్ బాస్ హౌస్ లోని తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. ఇక ఈ  బీబీ ఉత్సవకు సంబంధించిన  ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో విన్నర్ పల్లవి ప్రశాంత్, నయన పావని తన  ఫ్యామిలీ మెంబర్స్ ను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.  అలా మరోసారి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అంతా తమ కష్టసుఖాలు పంచుకున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్..తన తండ్రి గురించి ఓ విషయం చెబుతు కన్నీరు మున్నీరు అయ్యాడు.  తన అరెస్ట్ సమయంలో తండ్రి పడ్డ కష్టాలను తలచుకుని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ టైటిల్ కొట్టి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడాలని అనుకున్నానని, కానీ ఆయన కోర్టు బయట పడుకున్న వీడియో చూసి, తాను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను అనిపించిందని ప్రశాంత్ ఫీల్ అయ్యాడు. తన తండ్రిని అలా చూసి మస్తు బాధనిపించిందని ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కప్పు కొట్టిన ఆనందాన్ని ఆస్వాదించకుండా పల్లవి ప్రశాంత్ జైళ్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

చివరకు బెయిల్ పై విడుదలయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే జరిగిన రాత్రి పల్లవి ప్రశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. పోలీసుల సూచనలు లెక్కచేయకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడమే కాకుండా, భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తంగా ఈ ఇష్యూకు పల్లవి ప్రశాంత్ కారణం అంటూ పోలీసులు  అతడి అరెస్ట్ చేశారు. అనంతరం అతడు జైలు , కోర్టుల చుట్టు తిరిగి..చివరకు బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజాగా బీబీ ప్రోమో ద్వారా తనకు కలిగిన బాధ గురించి చెప్పుకుని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కన్నీరుపెట్టుకున్నారు. మరీ.. ఈ ప్రోమోను మీరు వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş