Swetha
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించకపోయిన.. ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డ్ అందుకుంది.
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించకపోయిన.. ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డ్ అందుకుంది.
Swetha
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించకపోయిన.. ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డ్ అందుకుంది. ముగ్గురు హీరోల కంబ్యాక్ మూవీ భైరవం . ఈ సినిమా మే 30 న థియేటర్ లో ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజులు సినిమా థియేటర్ లో మంచి టాక్ సంపాదించుకుంది. ఇక గతవారం ఈ సినిమా జీ5 సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఓటిటి లో దూసుకెళ్లే సినిమాలలో ఈ సినిమా కూడా యాడ్ అయింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటించిన మూవీ కావడంతో కాస్త ఇంట్రెస్ట్ చూపించిన మాట నిజమే. కానీ ఎందుకో థియేటర్ లో మొదటి వీకెండ్ బాగానే ఆడింది కానీ తర్వాత వీక్ అయిపోయింది. కానీ ఓటిటి లో మాత్రం ఇప్పుడు అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయి శ్రీనివాస్ చేసిన యాక్షన్ ఫైట్స్ కు అంతా ఫిదా అయిపోయారు. గతేడాది తమిళంలో వచ్చిన గరుడన్ మూవీ ఆధారంగా ఈ భైరవం మూవీని తీశారు . ఇంకా ఈ భైరవం సినిమా చూడకపోతే వెంటనే జీ 5 లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.