iDreamPost
android-app
ios-app

బుల్లితెర యాంకర్ రష్మీ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్

  • Published Aug 21, 2024 | 6:06 PM Updated Updated Aug 21, 2024 | 6:06 PM

Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది. ఇక విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది. ఇక విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Aug 21, 2024 | 6:06 PMUpdated Aug 21, 2024 | 6:06 PM
బుల్లితెర యాంకర్ రష్మీ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టార్ యాంకర్ దూసుకుపోతున్న వారిలో రష్మీ కూడా ఒకరు. ఇకపోతే ఈ బ్యూటీ మొదట జబర్ధస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన అందంతో వచ్చిన రాని తెలుగుతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వెండితెరపపై నటిగా మెరవలనే ఆసక్తితో యాంకర్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. కానీ, అక్కడ ఆశించిన స్థాయిలో రష్మీకి అదృష్టం కలిసి రాకపోవడంతో మళ్లీ బుల్లితెర మీద పలు షోల్లో యాంకర్ గా చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా యాంకర్ రష్మీ ఇంట్లో తన తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మీ ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ పోస్ట్ లో రష్మీ.. చివరిగా మాా తాతయ్య స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఈ ఆగస్టు 17వ తేదీన మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించడంతో ఆయనకు తుది వీడ్కోలు పలికాం. ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి. ఎందుకంటే.. మా బామ్మ భౌతికంగా  దూరమయ్యాక ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ గుర్తుంది. మన అవసరాల కోసం బామ్మ, తాతయ్యలు మనతోనే ఉండాలని మనం అనుకుంటాం. కానీ, ఆయనకు మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ తన బామ్మ తలకు తాతయ్య ఆయిల్ పెడుతున్న ఫోటోని ఆమె షేర్ చేస్తూ  ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే రష్మీ షేర్ చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ పై చూసి ఆమె అభిమానులు, నెటిజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.