బికినీ వేసుకోలేదని తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఓ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. బికినీ వేసుకోలేదని అతడు తిట్టాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఓ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. బికినీ వేసుకోలేదని అతడు తిట్టాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

చిత్ర పరిశ్రమలో స్టార్ గా వెలుగొందడం అంత సులువైన విషయం కాదు. ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని ఎదుర్కొన్నప్పటికీ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటామని కచ్చితంగా చెప్పలేం. అలాంటి రంగుల ప్రపంచం ఈ సినిమ పరిశ్రమ. ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్ గా వెలుగొందుతున్న, వెలుగొందిన వారు తమ కెరీర్ ప్రారంభంలో చవిచూసిన చేదు అనుభవాలను ఒకానొక సందర్భంలో వెల్లడిస్తూ ఉంటారు. అలా ఓ స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా చెప్పుకొచ్చింది. బికినీ వేసుకోలేదని అతడు తిట్టాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మనీషా కోయిరాలా.. 1990వ దశకంలో సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బ్యూటీ. 1991లో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మనీషా కోయిరాలా వరుస హిట్ సినిమాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. ‘బొంబాయి’ మూవీతో సౌత్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా తన కెరీర్ తొలిరోజుల్లో ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో బికినీ ధరించలేదంటూ ఓ వ్యక్తి తనను తిట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఏం జరిగిందంటే?

మనీషా కోయిరాలా మాట్లాడుతూ..”నా కెరీర్ స్టార్టింగ్ లో కొందరు ఫొటో గ్రాఫర్లు నన్ను ఫొటో షూట్ చేస్తామని అడిగారు. ఇక ఇదే సమయంలో ఓ ఫొటో గ్రాఫర్ నన్ను పొగడ్తలతో ముంచెత్తాడు. నేను స్టార్ హీరోయిన్ అవుతానని ప్రశంసించాడు. ఆ తర్వాత సడెన్ గా టూ పీస్ డ్రెస్ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించాడు. అయితే ఆ డ్రెస్ నేను స్విమ్ చేసేటప్పుడు మాత్రమే వేసుకుంటానని, ఇలా మూవీస్ లో అవకాశాల కోసం వేసుకోనని నిర్భయంగా చెప్పాను. దాంతో అతడు నన్ను తిట్టి.. వెళ్లిపోయాడు. అతడు నాకు ఓ మాట చెప్పాడు..’కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవ్వరూ బొమ్మను తయ్యారు చెయ్యలేరు’ అని చెప్పాడు” అంటూ పేర్కొంది మనీషా. అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక.. అతడే తన ఫొటో షూట్ తియ్యడానికి వచ్చాడని ఈ బ్యూటీ గతాన్ని గుర్తు చేసుకుంది. కాగా.. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడి.. 2014లో కోలుకుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ లో మల్లికాజాన్ పాత్రతో ఆకట్టుకుంది.

Show comments